దేశప్రజలపై ప్రత్యక్ష పన్నులను వేస్తూ.. భారీగా ఆదాయం ఆర్జిస్తున్న కేంద్రప్రభుత్వం.. మరోవైపు పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్పై రూ.15.83 నుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని చవిచేసిన నేపథ్యంలో ఇటీవల ఎనమిది రూపాయల మేర తగ్గించింది. ఈ క్రమంలో ఏకంగా ఎక్సైజ్ పన్ను ద్వారా 2019-2020లో ఏకంగా 3.35 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించిన కేంద్రప్రభుత్వం సామాన్యులకు ఎల్సీజీ గ్యాస్ సిలిండర్ పై దక్కే కనీస సబ్సీడీని కూడా కూకటివేళ్లతో పెకిలించి వేసింది.
జీఎస్టీ ఆదాయం ఏప్రిల్ నెలలో రూ. 1.68 లక్షల కోట్లతో రికార్డు స్థాయి గరిష్టస్థాయికి చేరిన తరుణంలో దేశప్రజలకు కేంద్రం ఏదేని విషయంలో ఊరట కల్పిస్తుందని ఆశించగా.. కేంద్రం మాత్రం ఎప్పటి నుంచో యూపీఏ ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సీడిని పూర్తిగా ఎత్తివేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగదారులకే రాయితీని పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతావారందరూ ఇకపై మార్కట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ మీడియాకు వెల్లడించారు.
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ వినియోగదారులకు సబ్సీడీ ఇవ్వడం లేదని చెప్పారు. ఇకపై ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్లకే సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 9 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పడు ఈ పథకం కింద ఉన్నవారికి ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. 2010లో పెట్రోల్పై సబ్సిడీ ఎత్తివేయగా.. 2014 నవంబర్లో డీజిల్పైన కేంద్రం సబ్సిడీని తొలగించింది. 2016లో కిరోసిన్పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేసిన ప్రభుత్వం.. తాజాగా గ్యాస్పై సబ్సిడీని ఎత్తివేస్తూ సామాన్యుడి నడ్డి విరిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more