రైలు ప్రయాణం చేసే అమ్మలకు రైల్వోశాఖ మధర్స్ డే సందర్బాన్ని పురస్కరించుకుని ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. అమ్మలు తమ చిన్నారి శిశువులతో కలసి రైలు ప్రయాణం చేసేప్పుడు వారికి కానీ లేక శిశువులకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా కొత్తగా ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై శిశివులు కలిగిన తల్లులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటినిండా నిద్రపోయేలా చేస్తోంది. తమ శిశివులను పక్కనే పడుకోబెట్టుకునే వీలుకలుగజేస్తోంది. ఇప్పటినుంచి రైలులో ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి సౌకర్యం అందుబాటులో రానుంది. అయితే పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతోంది.
ఈ క్రమంలోనే రైల్వేశాఖ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లక్నో – ఢిల్లీ మార్గంలో నడిచే లక్నో మెయిల్లో రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. అయితే, బేబీ బెర్త్ కోసం ప్రత్యేకంగా రైల్వే ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన తర్వాత పాలు తాగే శిశువులతో ప్రయాణించే మహిళలు సాఫీగా ప్రయాణం చేస్తారని రైల్వేశాఖ ట్వీట్ చేసింది. లక్నో మెయిల్లోని త్రీ-టైర్ ఏసీ కోచ్లో రెండు బెర్త్లతో పాటు బేబీ బెర్త్ను ప్రవేశపెట్టినట్లు రైల్వేశాఖ ట్వీట్లో ‘బేబీ బెర్త్’ ఫొటోను షేర్ చేసింది.
త్వరలోనే బేబీ బెర్త్ సదుపాయాన్ని ఇతర రైళ్లలోను వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా లక్నో డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ బేబీ బెర్త్ను రైలు లోయర్ బెర్త్లో ఏర్పాటు చేశామని, అవసరం లేని సమయంలో బెర్త్ను కిందికి మడతపెట్టవచ్చని పేర్కొన్నారు. బెర్త్ను ఏర్పాటు చేసుకోవడం సులభమని చెప్పారు. 770 మిల్లీమీటర్ల పొడవు, 255 మిల్లీమీటర్ల వెడల్పు, 76.2 మిల్లీమీటర్ల ఎత్తు ఉండే.. ఈ బేబీ బెర్త్కు.. బెర్త్పైనున్న శిశువు సురక్షితంగా ఉండేలా పట్టీలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more