చైనాలో మానవ అక్రమ రవాణా ముఠాల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆడవాళ్లను అటబోమ్మలుగా చేసిన అడుకుంటున్న ఘటనలు ఎంత దయనీయంగా, దారుణంగా వుంటాయా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. చల్లని గాలులు వీస్తున్న శీతల వాతావరణంలోనూ ఓ మహిళను తలుపులు లేని చిన్న గుడిసెలోఉంచారు. గుడిసెలో ఉంచడమంటే అమెకు మతిస్థిమితం సరిగా లేదన్న సాకుతో అమెను చావుకు చేరువ చేస్తున్నారు. ఈ అభాగ్యురాలితో కావాల్సిన పనులన్ని చేయించుకున్న తరువాత అమెను గొలుసులతో బంధించి ఓ గుడిసెలో నిర్బంధించారు. సరైన అహారం కూడా ఇవ్వకుండా.. ఎప్పుడు చస్తుందా.? అంటూ వ్యవహరించారు.
తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడీ వీడియోపై చైనాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మహిళలను కిడ్నాప్ చేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నాయి. ఈ వీడియో వెలుగులోకి వచ్చాక విద్యావంతుల నుంచి సామాన్యుల వరకూ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి దిగిన ఫెంగ్ కౌంటీ అధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా 17 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెంగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ను పదవి నుంచి తప్పించారు. తలుపు లేకుండా ఉన్న చిన్న గదిలో మెడలో గొలుసులతో బంధించిన మహిళ వీడియో గత నెలలో వైరల్ అయింది. యునాన్కు చెందిన బాధిత మహిళను 1998లో మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు జియాంగ్సుకు తెచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆమెను వధువుగా రెండుసార్లు విక్రయించారు. బాధిత మహిళకు 1995లో వివాహం కాగా రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. సాంగ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లింది.
అమె మాయమాటలకు లొంగిపోయిన బాధిత మహిళను ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని జియాంగ్సు ప్రావిన్సుకు తీసుకెళ్లి గోంఘాయ్ కౌంటీకి చెందిన వ్యక్తికి వధువు పేరుతో అమ్మేసింది. ఆ తర్వాత వారు వధువు పేరుతో మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఫెంగ్ కౌంటీకి చెందిన ఇంకో వ్యక్తికి విక్రయించాడు. అనంతరం ఓ వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం కూడా జారీ అయింది. 1999 నుంచి 2020 మధ్య బాధిత మహిళ ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more