AP minister Goutham Reddy passes away ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..

Andhra pradesh it minister mekapati goutham reddy 50 dies due to heart attack

AP IT minister Cardiac Arrest, AP Industries minister Heart attack, Andhra Pradesh Industries Minister, Mekapati Goutham Reddy, Mekapati Goutham Reddy cardiac arrest, Mekapati Goutham Reddy heart stroke, Mekapati Goutham Reddy heart attack, Mekapati Rajamohan Reddy, YSRCP, CM Jagan Mohan Reddy, Andhra Pradesh Minister Goutham Reddy, Heart Attack, Andhra Pradesh News

Andhra Pradesh IT Minister Mekapati Goutham Reddy, 50, passed away on Monday morning due to a heart attack. The minister's sudden demise has shocked the people of the state. The minister died of a heart attack while he was being treated at Apollo Hospital in Hyderabad

ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. ప్రముఖుల సంతాపం

Posted: 02/21/2022 11:20 AM IST
Andhra pradesh it minister mekapati goutham reddy 50 dies due to heart attack

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(50) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికీ వైద్యులు ఆయనను కాపాడేందుకు అత్యవసర చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. వారం రోజుల‌పాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న‌ గౌత‌మ్ రెడ్డి.. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఇటీవ‌లే కొవిడ్ బారిన ప‌డ్డ గౌత‌మ్ రెడ్డి త్వ‌ర‌గానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు అనుమానిస్తున్నారు.

గౌత‌మ్ రెడ్డి మృతితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ నేత‌లు తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల‌ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళుల‌ర్పించారు. గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. చివ‌రిసారిగా దుబాయ్‌లోని ఖ‌లీజ్ టైమ్స్‌కు గౌత‌మ్ రెడ్డి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గౌత‌మ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గౌత‌మ్ రెడ్డి స్వ‌గ్రామం నెల్లూరు జిల్లాలోని మ‌ర్రిపాడు మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి.

నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక‌వేత్త‌, రాజ‌కీయ‌వేత్త‌గా ఎదిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి.. తండ్రి బాటలోనే పయనిస్తూ.. సౌమ్యుడు, మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles