పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ‘కాంగ్రెస్కు ఓటు వేయండి, ఆప్కు వద్దు’ అంటూ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ‘ఆప్కి ఓటేస్తే ఉగ్రవాదానికి వేసినట్లే. పంజాబ్ను విచ్ఛిన్నం చేయడానికి వేసిన ఓటే. ఆప్కి ఓటేస్తే దేశానికి, పంజాబ్కు ద్రోహం చేసినట్లే. ఒకవేళ మాకు (బీజేపీ) ఓటు వేయకూడదనుకుంటే కాంగ్రెస్కు ఓటేయండి. దేశానికి ద్రోహం చేసే వారికి (ఆప్కు) మాత్రం ఓటు వేయవద్దు’ అని ప్రజలనుద్దేశించి అశ్వనీ శర్మ అన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ దీనిపై స్పందించారు. తన మాటలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. అసత్యాలను ప్రచారం చేయడం కాంగ్రెస్ పాత ఎత్తుగడ అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే తన మాటలను ఆ మేరకు వక్రీకరించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఆప్ రెండూ కూడా పంజాబ్కు మేలు చేయవని అశ్వనీ శర్మ అన్నారు. ఆ రెండు పార్టీలు పంజాబ్కు ప్రమాదకరమని విమర్శించారు. ‘బీజేపీ కోసం కమలం బటన్ను నొక్కండి. తద్వారా రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 06 | ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను... Read more
Aug 06 | మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్... Read more
Aug 05 | కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితిలో మేం ఉన్నాం. సంవత్సర... Read more
Aug 05 | లోకంలో తల్లి ప్రేమను మించింది లేదు. తన పంచప్రాణాలను పణంగా పెట్టైనా సరే తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇది సకల చరాచర సృష్టిలో అన్ని జీవులకు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా మన వరకు... Read more
Aug 05 | దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంపు,... Read more