"We Are Your Baap": Sena Warns BJP Minister కేంద్రమంత్రిపై శివసేన ఫైర్.. మేం మీకు అబ్బలాంటోళ్లం అని వ్యాఖ్య..

We are your baap sanjay raut hits back at narayan rane for threatening with ed notice

BMC, Sanjay Raut, Shiv Sena, BJP, Narayan Rane, Kirit Somaiya, ED, Brihanmumbai Municipal Corporation, Maharashtra, Politics

Shiv Sena MP Sanjay Raut replied to Union Minister Narayan Rane for 'threatening' the Maharashtra government, and the Thackeray family. "Narayan Rane is threatening that he has our horoscope. Stop giving threats. We too have your horoscope. You might be Union Minister but this is Maharashtra. Don't forget this. We are your 'baap', you very well know what that means", said Sanjay Raut.

కేంద్రమంత్రిపై శివసేన ఫైర్.. మేం మీకు అబ్బలాంటోళ్లం అని వ్యాఖ్య..

Posted: 02/19/2022 07:22 PM IST
We are your baap sanjay raut hits back at narayan rane for threatening with ed notice

కేంద్ర మంత్రి నారాయణ రాణే పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే కుటుంబం, మహారాష్ట్ర ప్రభుత్వం పై రాణే బెదిరింపులకు దిగడం పై శనివారం ఆయన స్పందించారు. మహారాష్ట్రకు చెందినవాడివై ఉండి రాష్ట్రంలోని పాలిత ప్రభుత్వాధినేతనే బెదిరిస్తావా.? నువ్వు కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నానన్న ధైర్యం నీకు ఉండోచ్చు. కానీ ఇది మహారాష్ట్ర.. బెదిరింపులకు దిగడం మానుకోవాలని హెచ్చరించారు. ‘మేము మీకు అబ్బలాంటోళ్లం (బాప్). మీకు దీనర్థం ఏమిటో బాగా తెలుసు’ అని సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలతో రాణేపై విరుచుకుపడ్డారు.

దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వాడివేడిని సంతరించుకున్నాయి. కొంతకాలంగా బీజేపీ వర్సెస్ శివసేన అన్నట్టుగా పోరు నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి నారాయణ రాణే శివసేన నేతలంటేనే మండిపడుతున్నారు. మాతోశ్రీ (థాకరేల నివాసం)లో నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్ డైరక్టరేట్‌కు చెందిన అధికారులు  సిద్ధమవుతున్నట్టు నాకు తెలిసింది అంటూ రాణే వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. నలుగురు మాతోశ్రీ వ్యక్తులకు, నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనారని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై సంజయ్ మాట్లాడుతూ ‘నారాయణ తన వద్ద మా జాతకం ఉందని హెచ్చరిస్తున్నారు. మా వద్ద కూడా ఆయన జాతకం ఉంది’ అని అన్నారు. మరో ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపణలపై స్పందిస్తూ.. ‘నీవు స్కామ్ కు సంబంధించిన పత్రాలు కేంద్ర సంస్థలకు ఇస్తే.. మేము నీకు సంబంధించినవి కూడా ఇస్తాం. భయపెట్టకు.. మేము భయపడము’ అని అన్నారు. సోమయ్య రూ.300 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. సోమయ్య కుటుంబ సభ్యులకు కూడా దీనిలో ప్రమేయం ఉందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles