కేంద్ర మంత్రి నారాయణ రాణే పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే కుటుంబం, మహారాష్ట్ర ప్రభుత్వం పై రాణే బెదిరింపులకు దిగడం పై శనివారం ఆయన స్పందించారు. మహారాష్ట్రకు చెందినవాడివై ఉండి రాష్ట్రంలోని పాలిత ప్రభుత్వాధినేతనే బెదిరిస్తావా.? నువ్వు కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నానన్న ధైర్యం నీకు ఉండోచ్చు. కానీ ఇది మహారాష్ట్ర.. బెదిరింపులకు దిగడం మానుకోవాలని హెచ్చరించారు. ‘మేము మీకు అబ్బలాంటోళ్లం (బాప్). మీకు దీనర్థం ఏమిటో బాగా తెలుసు’ అని సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలతో రాణేపై విరుచుకుపడ్డారు.
దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వాడివేడిని సంతరించుకున్నాయి. కొంతకాలంగా బీజేపీ వర్సెస్ శివసేన అన్నట్టుగా పోరు నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి నారాయణ రాణే శివసేన నేతలంటేనే మండిపడుతున్నారు. మాతోశ్రీ (థాకరేల నివాసం)లో నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్ డైరక్టరేట్కు చెందిన అధికారులు సిద్ధమవుతున్నట్టు నాకు తెలిసింది అంటూ రాణే వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. నలుగురు మాతోశ్రీ వ్యక్తులకు, నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనారని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై సంజయ్ మాట్లాడుతూ ‘నారాయణ తన వద్ద మా జాతకం ఉందని హెచ్చరిస్తున్నారు. మా వద్ద కూడా ఆయన జాతకం ఉంది’ అని అన్నారు. మరో ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపణలపై స్పందిస్తూ.. ‘నీవు స్కామ్ కు సంబంధించిన పత్రాలు కేంద్ర సంస్థలకు ఇస్తే.. మేము నీకు సంబంధించినవి కూడా ఇస్తాం. భయపెట్టకు.. మేము భయపడము’ అని అన్నారు. సోమయ్య రూ.300 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. సోమయ్య కుటుంబ సభ్యులకు కూడా దీనిలో ప్రమేయం ఉందని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more