ఈ మాయ పేరేమిటో చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్యా థాపర్. ఇటీవల ఏక్ మినీ కథ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. ముంబాయికి చెందిన ఈ అమ్మడు అక్కడ బాలీవుడ్ లోనూ పలు చిత్రాలలో తత్కాల్, మార్కెట్ రాజా ఎంబిబిఎస్ చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పటికీ అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ పెద్దగా గుర్తింపు రానీ ఈ బామ బోల్డ్ ఫోటోషూట్ లతో మాత్రం తనకంటూ ప్రత్యక గుర్తింపును తెచ్చుకుంది. గతేడాది జూలైలో కరోనా రెండో దశ అప్పుడప్పుడే తగ్గుతున్న క్రమంలో అమె షేర్ చేసిన ఫోటోలు కుర్రకారులో వేడిశగలను రాజేశాయి.
25 ఏళ్ల ఈ నటి.. ఐలవ్ పింక్, థింక్ పింక్, బ్లష్ పింక్ అనే ట్యాగ్ లైన్లతో అమె తన సామాజిక మాద్యమం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోటోలు కుర్రకారు మతలు పోగోట్టింది. ఇక అప్పటి నుంచి అమెకు కాసింత ఫాలోయింగ్ కూడా పెరింగింది. అయితే, తాజాగా అమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం అదేశానుసారం జుడీషియల్ రిమాండ్కు తరలించారు. అంతలా ఏమి నేరం చేసిందనేగా మీ డౌట్.? ముంబైలో మద్యం సేవించి కారు నడిపడంతో పాటు ఓ వ్యక్తిని గాయపర్చింది. అంతటితో ఆగని అమె అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై నోరుసారేసుకుంది. దీంతో పోలీసులు కావ్యా థాపర్ ను అరెస్ట్ చేశారు.
ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. దాంతో కావ్యా థాపర్ సదరు కారు డ్రైవర్ ను దూషించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై కూడా అసభ్య పదజాల ప్రయోగం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కావ్యా థాపర్ ఓ ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన కావ్యా థాపర్ ముంబయిలో నివసిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more