CBI probe resumes in YS Viveka Murder case వైఎస్ వివేక హత్యకేసు: మళ్లీ మొదలైన సీబీఐ విచారణ..

Ys viveka murder case cbi probe resumes three sakshi reporters interrogatted

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Key issues have come to light in the murder case of Andhra Pradesh Chief Minister YS Jagan Uncle YS Vivekananda Reddy. The CBI Charge Sheet states key points on the possible reasons for Viveka’s murder. The CBI had alleged in the Charge Sheet that YS Viveka was killed due to differences in the settlements.

వైఎస్ వివేక హత్యకేసు: మళ్లీ మొదలైన సీబీఐ విచారణ.. ‘సాక్షి’ విలేకరుల విచారణ

Posted: 02/15/2022 03:36 PM IST
Ys viveka murder case cbi probe resumes three sakshi reporters interrogatted

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏంటన్న విషయంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇందుకు భూలావాదేవీలు కారణమా.? లేక కడప పార్లమెంటరీ స్థానం కారణమా.? అన్న కోణాలతో పాటు దాదాపు అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన సీబిఐ ఇప్పటికే తొలి చార్జిషీటును న్యాయస్థానంలో దాఖలు చేసింది. గతేడాది అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సమర్పించిన చార్జిషీటు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిల పేర్లు పొందుపర్చింది.

వీరికి వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధాలు వున్నాయని తమ దర్యాప్తులో తేలిందన్న సీబిఐ.. సెటిల్ మెంట్లో బేధాల కారణంగానే ఆయన హత్య జరిగిందన్న విషయన్ని చార్జీషీటులో పేర్కోంది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి అదేశాల మేరకు వైఎస్ వివేకా బెడ్ రూమ్ తో పాటు ఆయన బాత్ రూమ్లోనూ రక్తపు మరఖలను పనిమనిషి తుడిచేసిందని సిబిఐ తమ చార్జిషీటులో పేర్కోంది. కాగా వైఎస్ వివేకా పోస్టుమార్టం నివేదికలో ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు వున్నాయిన పేర్కొనింది. అయితే వైఎస్ వివేకాకు ఎర్ర గంగిరెడ్డికి మధ్య బెంగుళూరులోని రూ.8 కోట్ల భూమి వ్యవహరాల విషయమై విభేధాలు వున్నాయని కూడా చార్జీషీటులో పోందుపర్చింది సిబిఐ.

ఇదిలావుండగా, వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిన్న ముగ్గురు అనుమానితులను సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి‌పై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఆయన ఫోన్‌ను సీజ్ చేసింది. ఆయన కాల్‌డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీరిలో ‘సాక్షి’ నెల్లూరు జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంటి నుంచి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది.

అలాగే, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు సాక్షి విలేకరులకు రెండు రోజుల క్రితం సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు దేవిరెడ్డి నుంచి వీరికి ఎక్కువసార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని గతంలో పలుమార్లు విచారించిన సీబీఐ తాజాగా మళ్లీ విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వివేకా ఇంటి నుంచి ఉదయ్‌కుమార్ హడావుడిగా వెళ్లిపోయినట్టు వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డిని కూడీ సీబీఐ విచారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles