మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏంటన్న విషయంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇందుకు భూలావాదేవీలు కారణమా.? లేక కడప పార్లమెంటరీ స్థానం కారణమా.? అన్న కోణాలతో పాటు దాదాపు అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన సీబిఐ ఇప్పటికే తొలి చార్జిషీటును న్యాయస్థానంలో దాఖలు చేసింది. గతేడాది అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సమర్పించిన చార్జిషీటు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిల పేర్లు పొందుపర్చింది.
వీరికి వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధాలు వున్నాయని తమ దర్యాప్తులో తేలిందన్న సీబిఐ.. సెటిల్ మెంట్లో బేధాల కారణంగానే ఆయన హత్య జరిగిందన్న విషయన్ని చార్జీషీటులో పేర్కోంది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి అదేశాల మేరకు వైఎస్ వివేకా బెడ్ రూమ్ తో పాటు ఆయన బాత్ రూమ్లోనూ రక్తపు మరఖలను పనిమనిషి తుడిచేసిందని సిబిఐ తమ చార్జిషీటులో పేర్కోంది. కాగా వైఎస్ వివేకా పోస్టుమార్టం నివేదికలో ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు వున్నాయిన పేర్కొనింది. అయితే వైఎస్ వివేకాకు ఎర్ర గంగిరెడ్డికి మధ్య బెంగుళూరులోని రూ.8 కోట్ల భూమి వ్యవహరాల విషయమై విభేధాలు వున్నాయని కూడా చార్జీషీటులో పోందుపర్చింది సిబిఐ.
ఇదిలావుండగా, వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిన్న ముగ్గురు అనుమానితులను సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఆయన ఫోన్ను సీజ్ చేసింది. ఆయన కాల్డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీరిలో ‘సాక్షి’ నెల్లూరు జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంటి నుంచి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి.. బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది.
అలాగే, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు సాక్షి విలేకరులకు రెండు రోజుల క్రితం సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు దేవిరెడ్డి నుంచి వీరికి ఎక్కువసార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. పులివెందులకు చెందిన ఉదయ్కుమార్రెడ్డిని గతంలో పలుమార్లు విచారించిన సీబీఐ తాజాగా మళ్లీ విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వివేకా ఇంటి నుంచి ఉదయ్కుమార్ హడావుడిగా వెళ్లిపోయినట్టు వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డాక్టర్ మధుసూదన్రెడ్డిని కూడీ సీబీఐ విచారించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more