ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలో తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. అవకాశం లభిస్తే చాలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ మధ్య కేంద్రహోం మంత్రి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల వరకే సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల మధ్య పోత్తు ఆ తరువాత ఎవరికి వారే అని విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. దానికి ఎస్సీ, ఆర్ఎల్డీ పార్టీల నేతలు కూడా కౌంటరిచ్చారు. తాజాగా బిజ్నోర్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించాల్సిన ర్యాలీ రద్దు కావడం పట్ల రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌధరి స్పందించారు. యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని ఎద్దేవా చేశారు.
బిజ్నోర్లో ప్రధాని స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఆపై ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరయ్యారు. ప్రతికూల వాతావరణంతో ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ కాలేకపోతోందని తాను కూడా సభా వేదికకు ఆలస్యంగా చేరుకున్నానని యోగి వివరణ ఇచ్చారు. అయితే బిజ్నోర్లో వాతావరణ పరిస్ధితులు బాగానే ఉన్నాయని జయంత్ చౌధరి ట్వీట్ చేశారు. బిజ్నోర్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడని.. బీజేపీ పరిస్ధితే బాగా లేదని చురకలు వేశారు. బిజ్నోర్ ర్యాలీలో 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వర్చువల్గా ప్రధాని మోదీ బిజ్నోర్, మొరదాబాద్, అమ్రోహ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 18 నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు.
ఇక యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు మాయావతి సారధ్యంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more