దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశంలో మూడవ విడత కరోనా మహమ్మారి పెద్దగా ప్రభావం చూపకుండానే అదృశ్యం కానుంది. అయితే మూడవ దశ తగ్గుముఖం పట్టి దేశవ్యాప్తంగా లక్ష లోపు కేసులు మాత్రమే నమోదు అవుతున్న క్రమంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ప్రపంచ అరోగ్య సంస్థ మరోమారు అప్రమత్తం చేసింది. మరో కరోనా వేరియంట్ వస్తే ఒమిక్రాన్ కంటే శరవేగంగా వ్యాప్తి చెందే ముప్పు ఉందని, అది వ్యాక్సిన్లకు లొంగదని డబ్ల్యూహెచ్వో సాంకేతిక విభాగ చీఫ్ మరాయా వాన్ కెర్ఖోవ్ అన్నారు. ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విజృంభించి వణికించాయి.
ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే వాటికంటే అధిక శక్తి సామర్థ్యాలు ఆ వేరియంట్కు ఉంటాయని కెర్ఖోవ్ చెప్పారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం అధికంగా ఉండే ముప్పు ఉంటుందని వివరించారు. ఈ కారణం వల్లే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు అది లొంగకపోవచ్చని తెలిపారు. ప్రపంచం ఇటువంటి స్థితిలోకి వెళ్లకూడదని కోరుకుందామని ఆమె అన్నారు. అటువంటి కొత్త వేరియంట్లు రాకుండా కరోనాను అరికట్టాలని ఆమె అన్నారు. అలాగే, కరోనా సీజనల్ వ్యాధిగానూ రూపాంతరం చెందే అవకాశాలూ ఉన్నాయని ఆమె చెప్పారు.
కరోనాను అరికట్టేంతవరకు నిబంధనలు పాటించాలని ఆమె చెప్పారు. మరోవైపు, కరోనా వ్యాప్తి అప్పుడే తగ్గినట్లు భావించకూడదని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ హెచ్చరించారు. ఈ వైరస్ తిరగబెట్టడానికి వైరస్ మ్యుటేషన్లు కారణమని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ను తొలిసారి గుర్తించి ఆమె ప్రపంచానికి ఈ విషయాన్ని తెలిపిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ కూడా మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని వేగంగా వ్యాప్తి చెందిందని ఆమె గుర్తు చేశారు. కరోనా మరొక వేరియంట్ రూపంలో విరుచుకుపడొచ్చని ఆమె హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, వ్యాక్సిన్లే వేసుకోవడమే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనముందు ఉన్న అవకాశాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more