Varun Gandhi Targets Govt Over Inflation, Unemployment అన్ని ప్రైవేటీకరిస్తే.. దేశం పరిస్థితి ఏమిటీ.?: వరుణ్ గాంధీ

Varun gandhi targets govt over selling of vital resources to private companies

Varun Gandhi, BJP Pilibhit MP, country vital resources, privatisation, sky-high inflation, increasing unemployment, corrupt politics, selfishness pllitics, Uttar Pradesh, Politics

Targeting his own party's government over inflation and unemployment, local BJP MP Varun Gandhi on Wednesday said important resources of the country were being sold in the name of privatisation. Stressing that the country is passing through a difficult time, Gandhi, who is on a two-day visit to his constituency, said inflation is touching the sky and unemployment is increasing rapidly.

అన్ని ప్రైవేటీకరిస్తే.. దేశం పరిస్థితి ఏమిటీ.?: వరుణ్ గాంధీ

Posted: 01/06/2022 06:00 PM IST
Varun gandhi targets govt over selling of vital resources to private companies

అధికారంలో వున్న తన సొంత పార్టీపై ఉత్తర్ ప్రదేశ్ ఫిలిబిత్ ఎంపీ వ‌రుణ్ గాంధీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. నిన్నమొన్న‌టి వరకు రైతుల సమస్యలపై గళమెత్తిన ఆయన.. ఆ తరువాత రైతులకు మద్దతుధరపై చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక సొంతపార్టీపై విమర్శలు సంధించడంపై మాట్లాడిన ఆయన తాను విప్లవాత్మక వ్యక్తినని, ప్రజలు సమస్యలతో బాధపడతుంటే తాను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

తనకు పార్టీ టిక్కెట్ల కేటాయిస్తుందా.? లేదా.? అంటే భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేద‌ని, నిజాలను నిర్భయంగా మాట్లాడుతాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కాగా, తాజాగా ఆయన ప్ర‌ధాని మోదీ పాల‌న‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. ప్రభుత్వం వ్యాపారం చేయడానికి కాదు అంటూ దేశంలోని 26 ప్రభుత్వం సంస్థల నుంచి వాటాను ఉపసంహరించుకుంటామని డిపార్టుమెంటు అప్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ ప్రకటించడం.. అందుకు కేంద్ర క్యాబినెట్ కూడా అమోద ముద్ర వేయడం.. ఈ క్రమంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను టాటా సంస్థకు అప్పగించడంపై వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశానికి చెందిన అత్యంత విలువైన అస్తులను, వనురులను అమ్మేస్తే దేశం గ‌తి ఏంకావాలి? అంటూ ఆయన సూటిగా ప్ర‌శ్నించారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌రుణ్ గాంధీపై కేంద్రంపై తీవ్రంగా మండిప‌డ్డారు. ప్రైవేటైజేష‌న్ పేరుతో అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం ఆకాశాన్ని తాకుతోంద‌ని, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయ‌ని మండిప‌డ్డారు. అవినీతి రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌లంద‌రూ అవ‌గాహ‌న‌తో ఉండాల‌ని, జాగ‌రూక‌త‌తో మెల‌గాల‌ని ఆయ‌న కోరారు. రాజ‌కీయం మొత్తం కూడా లాభాపేక్ష‌, స్వార్థంతో నిండిపోయింద‌ని, నిజాయితీప‌రులు రాజ‌కీయాల్లోకి రావాల‌ని వ‌రుణ్ గాంధీ ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles