Tollywood Young Hero among Shilpa Chowdary victims శిల్పాచౌదరి అక్రమాల ఛట్రంలో ఇరక్కుపోయిన యంగ్ హీరో.!

Tollywood young hero among harsh files police complaint against shilpa chowdary

page3 party, Shilpa arrested, producer Shilpa, Shipa chowdary, Tollywood hero Harsh, harsh kanumilli, saheri hero, film personalities, filmmakers, realtors, investments, high returns, cheating, Fraud, black money, high profile people, Narsingi police, Hyderabad, crime

Telugu Cinema Young Hero filed a complaint against socialite Shilpa Chowdary for duping him an amount of Rs 3 crores. According to the reports, Saheri movie hero Harsh kanumilli approached Narsingh police and filed a complaint against Shilpa Chowdary and alleged that she cheated Rs 3 Cr promising in the name of high returns.

తవ్విన కొద్దీ మోసాలు.. శిల్పాచౌదరి అక్రమాల ఛట్రంలో ఇరక్కుపోయిన యంగ్ హీరో.!

Posted: 12/03/2021 05:47 PM IST
Tollywood young hero among harsh files police complaint against shilpa chowdary

టాలీవుడ్ హీరోల‌తో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. రూ.కోట్ల మేర డబ్బును వసూలు చేసిన కిలాడీ లేడి శిల్పా చౌద‌రీ అవినీతి విన్యాసాల జాబితాలో తవ్విన కొద్దీ మోసాలు బయటపడుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా టాలీవుడ్ హీరోల నుంచి ప్రముఖుల వరకు అందరినీ అధికవడ్డీ పేరిట బురడీ కొట్టించి.. నల్లడబ్బును రూటు మార్చి సక్రమమైనదిగా తీసుకోస్తామని శఠగోపం పెట్టిన శిల్పా చౌదరి చేతిలో టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు సోదరి, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా మోసపోయిన విషయం వెలుగుచూసిన క్రమంలో మరో యంగ్ హీరో హర్ష్ కూడా నిట్టనిలువునా మోసపోయాడు.

శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమల్లి నట్టేట మునిగాడు. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పా పార్టీలకు అటెండ్ అయి ఆమె ట్రాప్‌లో పడ్డాడు ఈ యువ హీరో. ‘సెహరి’ సినిమాలో హర్ష్ కనుమల్లి హీరోగా నటించాడు.  ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకున్న శిల్పా.. ఆయనను తన ట్రాప్ లో పడేలా చేసి.. ఏకంగా రూ.3 కోట్లు తీసుకుని శఠగోపం పెట్టింది. ఓ స్టార్ హీరో కూడా ఆమె మాయ‌లో ప‌డి మోస‌పోయిన‌ట్టు తెలుస్తుంది. మరికొందరు సెలబ్రిటీలు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సుమారు 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. వారి నుంచి ప్రముఖులను పరిచయాలు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూళ్లు చేసింది. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసిన‌ట్లు వార్త‌లు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. న‌ల్ల‌ధ‌నాన్ని మార్పిస్తాన‌ని, అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి శిల్పి.. ప్ర‌ముఖుల్ని మోసం చేసింది. మోస‌పోయిన‌వారిలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు భావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles