టాలీవుడ్ హీరోలతో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. రూ.కోట్ల మేర డబ్బును వసూలు చేసిన కిలాడీ లేడి శిల్పా చౌదరీ అవినీతి విన్యాసాల జాబితాలో తవ్విన కొద్దీ మోసాలు బయటపడుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా టాలీవుడ్ హీరోల నుంచి ప్రముఖుల వరకు అందరినీ అధికవడ్డీ పేరిట బురడీ కొట్టించి.. నల్లడబ్బును రూటు మార్చి సక్రమమైనదిగా తీసుకోస్తామని శఠగోపం పెట్టిన శిల్పా చౌదరి చేతిలో టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు సోదరి, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా మోసపోయిన విషయం వెలుగుచూసిన క్రమంలో మరో యంగ్ హీరో హర్ష్ కూడా నిట్టనిలువునా మోసపోయాడు.
శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమల్లి నట్టేట మునిగాడు. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పా పార్టీలకు అటెండ్ అయి ఆమె ట్రాప్లో పడ్డాడు ఈ యువ హీరో. ‘సెహరి’ సినిమాలో హర్ష్ కనుమల్లి హీరోగా నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకున్న శిల్పా.. ఆయనను తన ట్రాప్ లో పడేలా చేసి.. ఏకంగా రూ.3 కోట్లు తీసుకుని శఠగోపం పెట్టింది. ఓ స్టార్ హీరో కూడా ఆమె మాయలో పడి మోసపోయినట్టు తెలుస్తుంది. మరికొందరు సెలబ్రిటీలు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సుమారు 200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. వారి నుంచి ప్రముఖులను పరిచయాలు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసింది. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లధనాన్ని మార్పిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్పి.. ప్రముఖుల్ని మోసం చేసింది. మోసపోయినవారిలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు భావించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more