బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి అంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తమిళనాడులోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఉదయం 8.30 గంటలకు వెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈక్రమంలో చిత్తూరు జిల్లాల మరీ హుక్యంగా తిరుపతిలో కురిసిన వర్షం ధాటికి రోడ్లు ఏరులయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్డులోని ఐదు ప్రాంతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు అలుముకున్నాయి. ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వాయుగుండం నుంచి ఉపరితలద్రోణి కోస్తాంధ్ర మీదుగా ఒడిశా వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించినట్టు పేర్కొన్నారు. తూర్పు దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. అయితే మరో రెండు మూడు రోజుల పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయి, అవసరం వుంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
వాతావరణంలో మార్పుల వల్ల తెలంగాణకు తుఫాన్ ముప్పు తప్పిందని, అయితే వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి వర్షం పడింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మి.మీలు వర్షపాతం నమోదైంది. కానీ శుక్రవారం రాత్రి నుంచి మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more