CBI arrests YSRCP state secretary in YS Viveka case వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని విచారించనున్న సీబిఐ

Ys viveka murder case cbi arrests ysrcp state secretary devireddy today

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

CBI arrested Devireddy Sivasankar Reddy, a YSRC leader from Pulivendula, in the murder case of former minister YS Vivekananda Reddy. Sivasankar is the fifth accused to be arrested by the CBI so far in the high-profile murder case.

వైఎస్ వివేక హత్యకేసు: వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని విచారించనున్న సీబిఐ

Posted: 11/18/2021 07:56 PM IST
Ys viveka murder case cbi arrests ysrcp state secretary devireddy today

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని నెలల కిందట ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. తాజాగా ఈ కేసులో వైసీపీ పార్టీ కీలక నేతను అరెస్టు చేసింది. సునీల్ యాదవ్ తరువాత విచారణ వేగం పెంచిన సీబిఐ.. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని ఇవాళ సీబిఐ అధికారులు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించగా, ఆ వాంగ్మూలంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది.

దాంతో సీబీఐ అధికారులు శివశంకర్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి పులివెందుల తరలించారు. ఇవాళ ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరచగా... కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను కడప జైలుకు తరలించారు. శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్ద భారీ కోలాహలం నెలకొంది. శివశంకర్ రెడ్డిని కలిసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. అయితే సీబిఐ సహా స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదిలావుంచితే, అప్పట్లో వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన కుమార్తె సునీతా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో అమె సమర్పించిన అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే దస్తగరి వాంగ్మూలం నేపథ్యంలో శివశంకర్ రెడ్డి పాత్రపై ఓ నిర్ధారణకు వచ్చిన సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణకు మాత్రమే పిలుస్తున్నామని చెప్పినా ఆయన రాకపోవడంతో సీబిఐ హైదరాబాద్ కు పయనమైంది. తన ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం తాను రాలేనని శివశంకర్ రెడ్డి చెప్పడంతో, సీబీఐ అధికారులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకుని పులివెందులకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles