తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు, మహా లఘు దర్శనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాలు నిబంధనల మేరకు జరగడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. రోజువారి కైంకర్యాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తేల్చిచెప్పంది. కాగా ఆలయ పాలకవర్గం నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించడం, లేదా ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా తాము జోక్యం చేసుకోగలమని తెలిపింది.
ఈ అంశాలలో మాత్రమే తాము జోక్యం చేసుకునేుందుకు అవకాశం ఉందని, వీటి విషయంలో పాలక మండలి నుంచి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరగలమని తెలిపింది. అంతేకానీ రోజువారి కైంకర్యాల విషయంలో తమ జోక్యం అక్షేపనీయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో సదరు పిటీషనర్ సంబంధిత ఆగమశాస్త్ర పండితులకు సంఘాలను కలవాలని తెలిపింది. కు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, పూజలు, కైంకర్యాలు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని టీటీడీ అఫిడవిట్ సమర్పించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది. టీటీడీ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
పిటిషనర్ తీరు చూస్తుంటే ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఆలయాలకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలను న్యాయస్థానాలు చేపట్టవన్న విషయం పిటిషనర్ గుర్తెరగాలని హితవు పలికింది. ఆలయాల్లో పూజలు, ఇతర కైంకర్యాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులకు సంబంధించిన విషయం అని స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పిటీషనర్ శ్రీవారి దత్త అనే భక్తుడికి ఎనమిది వారాల్లోగా సమగ్ర సమాధానాన్ని అందించాలని టీటీడీకి అదేశించింది. పూజా కైంకర్యాలపై సూచనలను టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరంను ఆశ్రయించాలని అటు పిటిషనర్ కు సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more