Terrorists escape after brief gunfight with security forces శ్రీనగర్ ఆసుపత్రిపై ఉగ్రవాదులు కాల్పులు.. చుట్టుముట్టిన భద్రతాదళాలు

Terrorists escape after brief shootout with forces at srinagar hospital

J-K Police, encounter, Srinagar hospital firing, Terrorists in Srinagar, SKIMS Hospital Srinagar, jammu kashmir, security forces, Crime

A gunfight broke out between terrorists and security forces at a hospital in Srinagar today following which the hospital and its hostels have been cordoned off. The terrorists, however, managed to escape taking advantage of the civilians present in the area, the police said. A large number of security forces have rushed to the spot.

శ్రీనగర్ ఆసుపత్రిపై ఉగ్రవాదుల కాల్పులు.. చుట్టుముట్టిన భద్రతాదళాలు

Posted: 11/05/2021 05:58 PM IST
Terrorists escape after brief shootout with forces at srinagar hospital

జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని ఆసుపత్రిలోకి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుుల చోరబడ్డారు. అసుపత్రిలోని సిబ్బందిని, రోగులను భయాందోళనకు గురిచేసేలా కాల్పులకు తెగబడ్డారు. దీంతో రోగులు, సిబ్బందితో పాటు రోగుల బంధువులు కూడా ఉగ్రవాదుల కాల్పులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే ఉగ్రవాదులు అసుపత్రిలోకి చోరబడ్డారని సమాచారం అందుకున్న భారత భద్రతాబలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి, వెంటనే అసుపత్రిని పూర్తిగా చుట్టుముట్టిన బలగాలు.. ఉగ్రవాదులకు ప్రతిగా కాల్పులు జరిపాయి. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా తుపాకుల మోతతో మార్మోగ్రిపోయింది.

అయితే సందట్లో సడేమియా అన్న చందంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అసుపత్రిలోని రోగులు, రోగుల బంధువుల మధ్య నుంచి వారు ఆ ప్రాంతం నుంచి బయటపడగలిగారు. అయితే వారిని పట్టుకునేందుకు భారత బలగాలు కూడా ఆయా ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అసుపత్రి సహా అందులోని హాస్టళ్లలో భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహించాయి., ఈ ఘటనపై శ్రీనగర్ పోలీసులు స్పందిస్తూ... టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న జనాల మధ్య నుంచి ఉగ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోయారని వెల్లడించారు.

కాగా జాతీయమీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం ఒక వ్యక్తి ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిని, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. వలస కూలీలపై టెర్రరిస్టులు ఇటీవల దాడి చేసిన తర్వాత టెర్రరిస్టులు బరితెగించడం ఇదే తొలిసారి. ఆ దాడి జరిగిన తర్వాత మరో 50 కంపెనీల సెక్యూరిటీని శ్రీనగర్ లో మోహరింపజేశారు. అయినా, ఈరోజు దాడి జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles