Raghuveera Reddy tied to a pillar! రఘువీరారెడ్డిని స్థంభానికి కట్టింది ఎవరు.?

Raghuveera reddy tied to a pillar

Congress leader, N Raguveera Reddy, Raghuveera tied to pole, Facebook picture, granddaughter samaira, Neelakanthapuram, AP PCC President, Andhra Pradesh, Politics

Former president of Andhra Pradesh Congress Committee (APCC) N. Raghuveera Reddy, posted on his Facebook profile a photograph of him tied to a pillar in his house. Mr. Reddy’s profile has more than 60,000 followers. “Annoyed that I haven’t spent enough time with her. My granddaughter Samaira tied me up to a pillar and demanded that I should stay at home to play with her,” Mr. Reddy wrote.

రఘువీరారెడ్డిని స్థంభానికి కట్టింది ఎవరు.?

Posted: 11/03/2021 12:12 PM IST
Raghuveera reddy tied to a pillar

ఆంధ్రప్రదేశ్ మాజీ పిసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినా.. ఎక్కడి ఆయన చుట్టూ ఒక్క అవినీతి అరోపణ లేదు. ఆయనను వేలెత్తి చూపించిన వారు లేరు. అయితే చేతులు జోడించి నమస్కరిస్తూ.. అయ్యా మాకు ఈ సాయం చేయండీ అన్నవారు మాత్రం ఎంతో మంది ఉన్నారు. రాజకీయాల్లో వున్న వ్యక్తికి ఇలాంటి విన్నపాలు రావడం షరామామూలే. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత కూడా ఆయనకు నిత్యం ఇలాంటి విన్నపాలు వస్తూనే వుంటాయి. అయినా ఆయన తనకు చేతనైనంత సాయం చేస్తూనేవుంటారు.

రాజకీయాల నుంచి వైదొలగిన తరువాత పూర్తిగా ఇంటి మనిషిగా మారి.. వ్యవసాయ పనులు, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్యతో కలిసి బైక్‌పై వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఆయన సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాంటి ఉన్నతమైన నేతను తాజాగా ఒకరు నిందిస్తూ.. ఆయనను తన ఇంట్లోనే స్థంబానికి కట్టేశారు. ఎవరా పని చేసిందని అవేశం తెచ్చుకోకండీ.. ఈ పని చేసింది ఎవరో బయటివారు కాదు.. స్వయంగా ఆయన మనవరాలే.

తాతయ్య మీద ప్రేమతోనే అమె ఆయనను కట్టేసింది. తనతో ఎక్కువ సమయాన్ని గడపడం లేదని, కోపం తెచ్చుకున్న ఆయన మనవరాుల సమైరా.. ఆయనను స్థంబానికి కట్టేసింది. ఇకపై ఇంట్లోనే ఉంటూ తనతో ఆడుకోవాలని చిన్నారి.. తాతయ్యను ప్రేమపూర్వకంగా అదేశించింది కూడా. ఈ మేరకు రఘువీరా ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో పాటు ఆయన పోస్టు చేసిన వివరాలతో కానీ విషయం అర్థం కాలేదు. ఈ పోస్టుపై నెటిజనులు లైకులు, కామెంట్లతో స్పందించడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles