కేరళలోని పతనంతిట్టా జిల్లాలో గల శబరిమల దేవాలయం పుణ్యద్వారాలు చితిర ఆట్టతిరునాల్ పండుగ నేపథ్యంలో తెరుచుకున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కొనసాగుతున్న క్రమంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు ముందుగానే ఆన్ లైన్ ద్వారా తమ స్లాట్ దర్శనాలు బుక్ చేసుకున్న భక్తులకే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. ఇక కరోనా వాక్సీన్ రెండు డోసులు తీసుకున్న ధృవపత్రాలున్న భక్తులకు మాత్రమే ఆలయంలోనికి అనుమతి కల్పిస్తున్నారు. అయితే వాక్సీన్ తీసుకోని వారితో పాటు వాక్సీన్ ఒక్క డోసు మాత్రమే తీసుకన్న భక్తులు.. లేటెస్టు కరోనా నెగిటివ్ నివేదకను చూపించాల్సి వుంటుంది.
అక్టోబర్ మాసంలో హరహరపుత్రుడి దర్శనానికి వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకుని.. వరదల కారణంగా రాలేకపోయిన భక్తులకు కూడా ఆలయ అధికారులు ఇప్పడు అనుమతించారు. కాగా ఈనెల 15వ తేదీ నుంచి మకరవిళ్లక్కు మండల పూజ కోసం దేవాలయం రెండు నెలల పాటు తెరవనున్నారు. అయ్యప్ప స్వామి భక్తుల మండల పూజ కోసం ఆలయాన్ని 15వ తేదీ నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, మండల పూజ క్రమంలో దేవాలయాన్ని దర్శించనున్న భక్తులు తప్పనిసరిగా తమ వర్చువల్ బుకింగ్ సిస్టమ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మలయాళీలకు తుల మాసం అత్యంత పవిత్రమైనది. దీంతో తుల మాసం పూజల నేపథ్యంలో ఆలయాన్ని తెరచి ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇక చితిర ఆట్టతిరునాల్ పండుగ నేపథ్యంలో తెరచిన ఆలయాన్ని నిన్న రాత్రి 9 గంటల తరువాత హరివాసన సేవ ముగించిన తరువాత మూసివేశారు. ఇదిలావుండగా, కేరళలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే వుంది. నిన్న ఒక్క రోజునే ఏకంగా ఐదు వేల 297 మంది కరోనా బారిన పడ్డారు. 368 మంది కరోనా బాధితులు అసువులు బాసారు. దీంతో ఇప్పటి వరకు కేరళలో 49.73లక్షల మంది కరోనా బారిన పడగా, వారిలో 32వేల 49 మందిని మహమ్మారి బలితీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more