ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమను పార్టీ పెట్టాలని కొందరు నేతలు ఇప్పటికీ బలవంతం పెడుతున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు.. ఏపీ మంత్రి పేర్ని నాని.. ఇక్కడ పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలసి.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసీన తెలంగాణ పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాలను కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తానంటే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారు.
అంతేకాదు తన స్టాండ్ కూడా సమైక్య రాష్ట్రమేనని సంగరాెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోమారు సమైక్య రాష్ట్రం నినాదం తెరపైకి వచ్చినట్టు అయ్యింది. అంసెబ్లీ హాల్ లో శనివారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన రాజకీయ చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆరే స్టార్ట్ చేశారనడంలో అనుమానం లేదని, ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో అన్ని పార్టీలు తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేశాయన్నారు.
సమైక్య రాష్ట్రం పేరు మీద ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని, కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనించాలని జగ్గారెడ్డి కోరారు. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో స్పేస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో తాము కూడా తెలంగాణ కొడుకని టీడీపీ నుంచి లోకేశ్, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వారసులు వచ్చినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. తనది ముందు నుంచీ సమైక్య రాష్ట్రమేనని, తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని పీసీసీలో ఎక్కడా లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుకునే అర్హత రేవంత్ కు లేదన్నారు. తాను ఎప్పటికైనా రేవంత్రెడ్డికి క్షమాపణ చెప్పనని, చెప్పే పరిస్థితి కూడా రాదన్నారు. గతంలోనూ కేవలం మాణిక్కం ఠాగూర్కు మాత్రమే క్షమాపణ చెప్పానన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more