దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని మూడు లోక్సభ స్థానాలతో పాటు, 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్డా లోక్ సభ స్థానంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంటు స్థానానికి.. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దద్రానగర్ హవేలి లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు ఉధయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పరిధిలోని బద్వేల్ స్థానంతో పాటు తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. బద్వేలులో ఉదయం 9 గంటల సమయానికి 10.50 శాతం ఓటింగ్ కూడా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలోనూ ఉప ఎన్నికల కొలహలం బాగానే కనిపిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకుని పనులపై వెళ్లేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటలకు వరకు దాదాపు 10.5శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.
Andhra Pradesh | Voters queue outside a polling station in Badvel Assembly constituency in Kadapa district to exercise their franchise in the bypolls pic.twitter.com/1srbMFgTYr
— ANI (@ANI) October 30, 2021
మరోవైపు అస్సోంలోని గోస్సాయ్ గావ్, భబాణీపూర్, తముల్ పూర్, మర్యాని, తోబ్రా అసెంబ్లీ స్థానాలకు.. బిహార్ లోని కుషేశ్వర్ అస్తాన్, తారాపూర్ అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని ఎలనాబాద్ అసెంబ్లీ స్థానానికి.. హిమాచల్ ప్రదేశ్ లోని ఫతేపూర్, అర్కి, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలకు, కర్ణాటకలోని సింద్గీ, హంగల్ అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్ లోని పృధ్వీపూర్, రాయ్ గావ్ అసెంబ్లీ స్థానాలకు, మహరాష్ట్రలోని డెగ్లూర్ అసెంబ్లీ స్థానానికి, మేఘాలయలోని మావ్రింగ్నెంగ్, మాఫ్లాంగ్, రాజబాల అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
మిజోరంలోని టుయిరియల్ అసెంబ్లీ సీటుకి, నాగాలాండ్ లోని షామ్తోర్-చెస్సోర్ అసెంబ్లీ స్థానానికి, రాజస్థాన్ లోని వల్లభనగర్, ధరియావాడ్ అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ ల్లొని దిన్హటా, శాంతిపూర్, ఖర్దహా, గోసబా, భబానీపూర్, సంసర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ స్థానాలతో పాటు ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా మిజోరంలోని టుయిరియల్ అసెంబ్లీ స్థానానికి రికార్డు స్థాయిలో ఉదయం ఏడు గంటలకే 17 శాతం ఓటింగ్ నమోదైంది.
Voting for bypolls is underway at 27 polling stations in Tuirial Assembly constituency of Mizoram
— ANI (@ANI) October 30, 2021
(Photo source: Election Commission of India) pic.twitter.com/5S5ahR4GQZ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more