కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రా.. తన కారును ఘెరావ్ చేసిన రైతులను తోసుకుంటూ వారిపై నుంచి కారును తొక్కేస్తూ వెళ్లిన ఘటనలో తొమ్మిది మంది మరణించగా, వారిలో నలుగురు రైతులతో పాటు ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేంద్రమంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి. ఆయన కొడును అరెస్టు చేయాలన్న దేశవ్యాప్త డిమాండ్లతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా రైతు సంఘాల అందోళనలతో పాటు విపక్షాలు కూడా పిలుపునిస్తున్నాయి.
ఓ వైపు ఉత్తర్ ప్రదేశ్ ఘటనతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుండగా, మరోవైపు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏకంగా కేంద్రమంత్రి తరహాలోనే రైతులకు వ్యతిరేకంగా వారి తీరులోనే జవాహివ్వాలని వ్యాఖ్యనించడం వివాదాలకు దారితీసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల తక్షణ ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న వేళ.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అందోళనకు అజ్యం పోశారు. ప్రతీ జిల్లాలో వెయ్యి మంది బీజేపి కార్యకర్తలు స్వచ్చంధ సేవ బృందంగా ఏర్పడి రైతులకు వారి తరహాలోనే సమాధానం చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టాలంటే వారిని లాఠీలతో కొట్టాలంటూ మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఇక ఈ ఘర్షణలలో జైళ్లకు వెళ్లే కార్యకర్తలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. అంతేకాదు.. అన్ని తామే చూసుకుంటామని అన్నారు. జైళ్లకు వెళ్లి రెండు, మూడు, ఆరు నెలలు ఉంటే చాలు మీరు పెద్ద నాయకులు అవుతారు అంటూ ఆయన రెచ్చగొట్టేు వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో మీ పేరును లిఖించాలంటే ఇలాంటి ఘటనలకు పాల్పడాల్సిందేనంటూ యువతను రెచ్చగోట్టారు. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. రాజ్యాంగబద్దమైన పదవులలో వుంటూ ఇలా రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేస్తారా.. అని ప్రశ్నించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more