ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అజయ్ మిశ్రా దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే.. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన తనను మాత్రం రాష్ట్రంలోని బీజేపి ప్రభుత్వం అడ్డుకుని.. అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. తనను అరెస్టు చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్ఐఆర్ లేకుండా తనను 28 గంటలుగా సీతాపూర్లోని పీఏసీ అతిధి గృహంలో నిర్బంధించారని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనలలో చెలరేగిన హింసలో నలుగురు రైతులతో పాటు తొమ్మది మంది మరణించిన ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటలలోనే అరెస్టు చేసిన వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాల్సి వున్నా.. తనను మాత్రం గత 28 గంటలుగా నిర్భంధంలోనే ఉంచారని చెప్పుకోచ్చారు. బీజేపి ప్రభుత్వాలు చట్టానికి అతీతమా.? చట్టాలను అనుసరించి నడుచుకోవాల అంటూ అమె ప్రశ్నించారు. కనీసం తనను అరెస్టు చేసిన నేపథ్యంలో తనపై మొపబడిన అభియోగాలను కూడా తెలపలేదని దుయ్యబట్టారు.
లఖింపూర్ ఘర్షణలకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పట్ల ప్రియాంక గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. నేరం చేసినవారు స్వేచ్ఛాగా తిరుగుతున్నారని, కానీ మృతులను పరామర్శించేందుకు వచ్చిన తనను మాత్రం గత 28 గంటల నుంచి నిర్భంధంలో వుంచారని దుయ్యబట్టారు. దేశంలో రైతులను బీజేపీ ఎంతలా ద్వేషిస్తోందని ప్రియాంక గాంధీ అంతకుముందు ట్వీట్ చేశారు. రైతులు గళమెత్తితే మోదీ ప్రభుత్వం వారిని కాల్చిచంపుతుందని, కార్లతో గుద్ది చంపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్నోలో దేశ స్వాత్రంత్య అమృతోత్సవాలకు హాజరవుతున్నారు. వేడుకలను ఘనంగా జరిపిస్తున్నారు.
కానీ నిజంగా దేశానికి వెన్నుముక్కగా నిలిచిన రైతులను ఎందుకు కించపరుస్తున్నారు. రైతులను తమ కార్ల టైర్లతో తొక్కుకుంటూ వెళ్లిన కేంద్రమంత్రి తనయుడిని ఎందుకు అరెస్టు చేయలేదు. సదరు మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు. కనీసం ఈ వీడియోనైనా మీరు చూశారా అని ప్రశ్నిస్తూ లఖింపూర్ వీడియోను అమె విడుదల చేశారు. కాగా లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకువెళ్లడంతో నలుగురు రైతులు మరణించారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ప్రియాంక గాంధీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగారు.
TW: Extremely disturbing visuals from #LakhimpurKheri
— Congress (@INCIndia) October 4, 2021
The silence from the Modi govt makes them complicit. pic.twitter.com/IpbKUDm8hJ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more