బిహార్ లోని ఉపఎన్నికల నేపథ్యంలో లోక్ జనశక్తి పార్టీకి చీలిక వర్గాలకు కొత్త గుర్తులు, కొత్త పార్టీ పేర్లను జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీతో పాటు పార్టీ గుర్తును ఎవరికీ కేటాయించని ఎన్నికల సంఘం.. పార్టీ రెండు వర్గాలుగా చీలిన క్రమంలో ఇధ్దరు పార్టీ నేతలకు వారు కోరుకున్న విధంగా పార్టీ పేర్లను మంజూరు చేసింది. అయితే ఎల్సేజి పార్టీకి చెందిన బంగ్లా గుర్తును మాత్రం ఎవరికీ కేటాయించలేదు. కాగా రామ్ విలాస్ పాశ్యాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ వినతి మేరకు ఆయనకు లోక్ జనశక్తి (రామ్ విలాస్) అని పార్టీ పేరును మంజూరు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో విబేధాలకు దిగిన పశుపతి కుమార్ పారస్కు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పేరును కేటాయించినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. పశుపతికి చెందిన పార్టీకి కుట్టు మిషన్ గుర్తును ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది. పార్టీ పేరు, గుర్తుల కోసం చిరాగ్, పశుపతి మధ్య కొన్నాళ్లుగా వైరం ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వాళ్లు ఇద్దరూ వేరుపడ్డారు కూడా. అయితే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చిరాగ్, పశుపతిలకు వేర్వేరు పార్టీ పేర్లు, గుర్తులను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
పార్టీ పేరు, గుర్తులపై చిరాగ్, పశుపతి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘం వాటిని సీజ్ చేసింది. బీహార్లోని కుశ్వేశ్వర్ ఆస్తాన, తారాపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఆ నిర్ణయం తీసుకున్నది. పార్టీ పేరును ఇద్దరు వాడరాదంటూ ఈసీ చెప్పింది. ఎల్జేపీ వాడే బంగ్లా సింబల్ను కూడా ఎవరూ వాడకూడదని శనివారం ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మూడు ఇతర గుర్తులను ఎన్నుకోవాలని రెండు వర్గాలకు ఈసీ సూచన చేసింది. దాని ప్రకారమే ఇవాళ కొత్త గుర్తులను ఈసీ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more