సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయ అర్మత పరీక్షను ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీబీఎస్సీ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలో 60 శాతం మార్కులు సాధించినవారిని అర్హులుగా పరిగణిస్తారు.
* అర్హత: బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి.
* ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
* రాతపరీక్ష: డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు. రెండు షిప్టులలో ఉదయం, సాయంకాలం పరీక్షలు
* మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
* రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష విధానం
* రెండు పేపర్లు ఉంటాయి.
* ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మొదటి పేపర్,
* ఆరు నుంచి 8వ తరగతి వరకు పేపర్-2 ఉంటుంది.
పేపర్-1: పరీక్ష మొత్తం 150 మార్కులు.
* ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* ప్రతి సెక్షన్ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పేపర్-2: మొత్తం 150 మార్కులు
* ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* మొదటి మూడు సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు.
* మిగిలిన రెండు సెక్షన్లకు 60 మార్కుల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, రెండు పేపర్లు అయితే రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు రూ.500, రెండు పేపర్లు అయితే రూ.600
-*- ముఖ్యమైన తేదీలు -*-
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 19
వెబ్ సైట్: ctet.nic.in
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more