ఓ వైపు వరుణుడు కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న తరుణంలో దానిని తమకు అనుకూలంగా మార్చుకున్న దొపిడీ దోంగలు నగర శివారు ప్రాంతాల్లో హల్ చల్ చేస్తున్నారు. వర్షం కురుస్తున్నశబ్దంలో తాము చేసే శబ్దాలు వినబడవని, వినబడినా.. వర్షంలో ఎవరూ భయటకు రారని.. తమ పనిని నిర్వఘ్నంగా ముగించుకోవచ్చునని దొంగలు చెలరేగి పోతున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుని గ రెండు రోజులుగా నగరంలోని, శివార్లలోని పలు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ దోంగల దాడి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని స్వేచ్చగా నిద్రపోతున్న నగరాన్ని మరో దోంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.
తాజాగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస లేక్ వ్యూ విల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న భారీ కట్టర్లు, ఇనుప రాడ్ల సాయంతో ఈ లేక్ వ్యూ విల్లా చుట్టూర వున్న సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసిన నలుగురు దుండగుల ముఠా కాలనీలోకి ప్రవేశించారు. ఈ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. కాలనీ సెక్యూరిటీ గార్డులతో పాటు సోసైటీ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయగా వారు వచ్చి కాలనీలో పరిశీలించారు. దొంగల వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్ టీం సభ్యులు కూడా రంగంలోకి దిగారు.
సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ముఠా సభ్యులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుని గత కొంత కాలంగా ఈ తరహాలోనే చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం పూట రెక్కి నిర్వహించి.. సాయంత్రం దోంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more