రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠశాలలను ప్రత్యక్ష విద్యాబోదనను నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్టే విధించింది. రేపటి నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభించాలన్న నిర్ణయంపై స్టే విధించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలను సంధించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఎలాంటి ఒత్తిడికి గురిచేయవద్దని ఆదేశించింది. ఇక తమ పిల్లలను ప్రత్యక్ష బోధనకు పంపిస్తామంటూ వారి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.
సొంత భవనాలు లేని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు.. గత రెండేళ్లుగా పాఠశాలల నిర్వహణ లేకపోయినా భవన యజమానులకు లక్షల రూపాయలను అద్దెగా చెల్లిస్తూ.. అర్థికంగా కుంగిపోతున్నారని.. ఇక పాఠశాలలో ప్రత్యక్ష బోధన లేకపోతే.. విద్యార్థులు కూడా చదువుల్లో వెనుకబడిపోతారని భావించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ఇటీవల అదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్ నిబంధనల మేరకు బెంచికి ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునే వెసలుబాటు చేయాలని., తరగతి గదులను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో శానిటైజ్ చేయాలని కూడా అదేశించిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ అదేశాల మేరకు పాఠశాల యాజమాన్యాలతో పాటు విద్యాసంస్థలు కూడా అన్ని సిద్దం చేసుకున్న తరుణంలో.. హైకోర్టు తాజాఅదేశాలతో అందుకు బ్రేక్ పడింది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలల పునఃప్రారంభంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా వైరస్ తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో ప్రశ్నించారు. స్కూళ్లలో చిన్న వయసు పిల్లలు ఉంటారని... వైరస్ వల్ల వారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లో సిబ్బంది, విద్యార్థులు అందరూ కలిపితే... వందల మంది ఉంటారని... దీని వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్-నవంబర్ మధ్య తీవ్రస్థాయికి చేరుకునే అకాశాలు వున్నాయిని ఇప్పటికే అరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో... ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష బోధన వద్దని కోర్టును కోరారు. ఈ వాదనలను విన్న అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more