ద్విచక్రవాహనల తయారీ సంస్థ హీరో తమ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. అయితే ఇది అన్ని ద్విచక్రవాహనాలకు కాదు సుమా.. కేవలం హీరో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే. హీరో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ వాహనాల ఉత్పత్తి శరవేగంగా సాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే హీరో కంపెనీ తమ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పిస్తుంది. కంపెనీలో కనీసం రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి ప్రయోజనాలను కల్పించడానికి ఓ కార్యక్రమం ప్రవేశపెట్టింది.
అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమన స్థాయిలో బెనిఫిట్స్ కల్పించనుంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కంపెనీలో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ఉపాధిని కల్పించడం. ఉద్యోగులకు వాహన రుణాలను అందించడం, అలాగే అదనపు సెలవులు ఇవ్వడం. దీర్ఘకాలిక గృహ రుణాలను స్థిర వడ్డీకి హీరో కేర్ అందిస్తుంది. ఉద్యోగులకు ప్రసూతి సెలవుల కింద 15 రోజులు సెలవులు ఇవ్వడం, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి 3 నెలల్లో 10 రోజుల వరకు ఇంట్లో నుంచి పనిచేయవచ్చు. 20-25 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు పనితీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు, స్కాలర్ షిప్స్ ఇవ్వనుంది.
పరీక్షల సమయంలో వారికి ఫ్లెక్సీబుల్ టైమింగ్స్ కల్పించనుంది. ఇక ఈ అంశంపై హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. తమ ఉద్యోగులు రెండేళ్లుగా కష్టపెడుతున్నారని.. ఈ రోజు తాము ఈ స్థాయికి చేరుకున్నామంటే ఉద్యోగుల కృషి పట్టుదలే కారణమని.. అన్నారు. తమ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులకు సంస్థ సాయం అందిస్తుందని వివరించారు. రిటైర్ అయిన ఉద్యోగులు మాజీ హీరో క్లబ్ లోచేరి తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది అని అన్నారు. రిటైర్ అయినవారు క్లబ్ లో జాయిన్ అయితే ఐదేళ్ల పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more