హైదరాబాదులో దారుణం జరిగిందన్న ఘటన కీలక మలుపు తిరిగింది. ఆటో ఎక్కిన తనపై అటో డ్రైవర్ దారి మళ్లించి అత్యాచారం చేశాడని అరోపించిన కేసు పచ్చి బూటకమని తేలింది. అపస్మారక స్థితికి చేరుకున్న తాను తేరుకున్న తరువాత నేరుగా పోలీసు స్టేషన్ వచ్చి పిర్యాదు చేశానని చెప్పిన యువత క్రైమ్ సినిమాను తలపించే రేంజ్ లో కట్టుకధలను అల్లిందని పోలీసులు గుర్తించారు. అయితే ఇంతలా నాటకం ఆడాల్సిన అవసరం ఏమిటీ అంటే.. తన బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకేనని స్పష్టం చేసింది.
సంతోష్నగర్లో నివసిస్తున్న 20 ఏళ్ల యువతి మైలార్ దేవ్ పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. క్రితం రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విధులకు బయలుదేరిన ఆమె ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే తాను సృహలోకి వచ్చిన తరువాత నేరుగా వెళ్లి జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పిన యువతి పూర్తిగా కట్టుకథను చెప్పిందని పోలీసులు తేల్చారు.,
అయితే ఇదంతా నాటకమని పోలీసులు తేల్చేశారు. అసలు ఆమె పైన గ్యాంగ్ రేప్ జరగలేదని వైద్యుల నివేదికలు కూడా తేల్చాయి, దీంతో గాంధీ అసుపత్రి ఘటనలో అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనలో మరో బాధితురాలిని వెతికే పనిలో నిమగ్నమైన పోలీసుల.. ఈ కేసును సవాల్ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలే గాంధీ అసుపత్రి కేసులో విమర్శలను ఎదుర్కోంటున్న తామకు ఈ కేసు సవాల్ గా మారిందని భావించిన పోలీసులు ఉరుకులు పరుగుల మధ్య కేసును గంటల వ్యవధిలోనే చేధించారు.
బాధితురాలు పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సంతోష్నగర్ పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. యువతి చెబుతున్న వివరాలకు.. సిసిటీవీలో వున్న ఫూటేజీకీ.. సీన్ ఆఫ్ అపెన్స్ కు ఎక్కడా పోందతన కుదరలేదు. పలువురు అటోడ్రైవర్లను కూడా పోలీసులు విచారించినా ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. యువతి ఇంటి నుంచి అమె పనిచేసే డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా కేవలం పదిహేను నిమిషాల నడకదారని.. అలాంటి అటో ఎక్కి వెళ్లాల్సిన అవసరమేంటని పోలీసులకు అనుమానం వచ్చింది.
దీంతో ఇది మరో ఘట్ కేసర్ ఘటనగా సందేహాలు వ్యక్తం చేసిన పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకొని విచారించారు. రాత్రి పూట బయటకు వెళ్లేందుకు ఈ నాటకం ఆడినట్లుగా యువతి ఒప్పుకుంది. తనను కాదని మరో యువతితో తన భాయ్ ఫ్రెండ్ నిశ్చితార్థం కుదుర్చుకున్నాడన్న విషయం తెలిసిన అమె.. తన ప్రియుడిని అత్యాచారం కేసులో ఇరికించాలని పథకం రచించింది. అందుకు అనుగూణంగా అమె తన నాటకాన్ని అడింది. తన ప్రియుడ్ని అరెస్టు చేయించి ప్రతీకారం తీర్చుకోవాలని అత్యాచారం డ్రామాకు తెరలేపింది.
అత్యాచారం డ్రామాకు తెరలేపిన అసలు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. యువతిపై అత్యాచారం జరిగిందన్నపిర్యాదు నమోదుకావడంతో.. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు బృందాలుగా వీడి.. ఒక బృందం అటోడ్రైవర్లను విచారించగా, మరో బృందం సీన్ ఆప్ అఫెన్స్ కు చేరుకుని పరిశీలన చేయగా, ఇంకో బృందం సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించింది. అయితే యువతి కట్టుకథ అల్లిందని తెలిసేన తరువాత పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఇంత కట్టుకథ అల్లిన యువతి పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more