మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో ఇప్పటికే 47 రోజులుగా సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. మరొ రెండు మూడు రోజుల్లో ఈ కేసులో చార్జిషీటును న్యాయస్థానంలో సమర్పించేందుకు రెడీ అయ్యారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇందుకు సంబంధించి సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది.
కాగా ముగ్గురు కీలక నిందితుల పేర్లు బయటకు రావడంతో.. సీబిఐ అధికారులు విచారణ పేరుతో తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ధర్డ్ డిగ్రీ పద్దతులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలా అయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మరుసటి రోజు నుంచి అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో తన ఇంటికి తాళం వేసిన కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ తన కుటుంబంతో పాటు కనిపించకుండాపోయాడు. ఆయన ఇంటికి తాళం వేసి ఉంది, దీంతో సీబిఐ అధికారులు కూడా ఆయన జాడ కోసం బంధువులను వాకాబు చేస్తున్నారు.
ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా, వివేకానందరెడ్డి ఇంటి వాచ్మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఐపీసీ సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more