పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజేపి) ఓటమి పాలు కావడానికి పార్టీకి చెందిన కొందరు నాయకుల మితిమీరిన ధీమ, విశ్వాసమే కారణమని బీజేపి శాసనసభాపక్ష నేత సువేందు అధికారి అన్నారు. ఎన్నికలలో తమ పార్టీ తరపున బరిలోకి దిగిన అనేక మంది అభ్యర్థులు ప్రచారానికి ప్రాముఖ్యత ఇచ్చారని, అయితే అదే స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడం మర్చిపోయారని, దీంతోనే తమ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యిందని సువేందు అధికారి అభిప్రాయపడ్డారు.
పూర్వ మెడినిపూర్ జిల్లాలోని చండీపూర్ లో జరిగిన ఓ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపి ఓటమికి సోంత పార్టీ నేతలే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదెలా అందుకు కారణాలను కూడా వివరించారు. తొలి రెండు విడతల పోలింగ్ లో బీజేపీకి భారీ మద్దతు లభించిందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే బీజేపీ నేతలు కొందరు అతి విశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారని ఆయన విమర్శించారు. బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు కూడా వేనుకున్నారని, దీంతో క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిర్లక్ష్యం వహించారని, అందుకే బీజేపీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.
కాగా సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మండిపడ్డారు. సోంత పార్టీ నేతలను వ్యాఖ్యలు చేసి.. ఓటిమి నైతిక బాధ్యత వహించాల్సిన మీరే తప్పించుకోవాలని చూడటం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ 170 నుంచి 180 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని సువేందు అనేక పర్యాయాలు చెప్పిన విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు వున్నారని ఎద్దేవా చేశారు. బీజేపి నేతలను పగటి కలలు కనేలా చేసిందే సువేందు అని వ్యంగోక్తులు విసిరారు. బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం తమ ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ అనేక పథకాలను తీసుకోచ్చారని అన్నారు.
కాగా తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగానే కాకుండా అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అత్యంత కీలక పాత్రను పోషించిన సువేందు అధికారి ఇటీవల బీజేపి పార్టీలో చేరి ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి పోటీగా నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఇక్కడ గెలుపు ఓటములు దోబుచులాడిన తరువాత ఎట్టకేలకు సువేందు అధికారి.. మమతా బెనర్జిని ఓడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భారతీయ జనతా పార్టీని.. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. దీంతో అమె మరోమారు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను కూడా చేపట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more