పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సుస్ఫష్టంగా కనిపిస్తున్నాయని, ఈ తరుణంలో వాటిని విఛ్చిన్నం చేసేలాంటి ఎలాంటి చర్యలను ప్రోత్సహించరాదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి చేసిన విన్నపాలను తోసిరాజుతూ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్తో నవజ్యోత్ సింగ్ సిద్దూకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో సిద్ధూకు పీసీసీ పదవి ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోనియాకు రాసిన లేఖలో సిద్దూను పీసీసీ పీఠంపై కూర్చోబెడితే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్దూకే పిసిసి అధ్యక్షుడిగా ఎంపికి చేసింది. టీమిండియా మాజీ క్రికెట్ పార్టీని బలోపేతం చేస్తాడని భావించింది. ఆయనకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే పార్టీలో యువరక్తం కూడా వచ్చి చేరుతుందని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడింది.
దీంతో పంజాబ్ పిసిసి అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిస్తూ గత రాత్రి ప్రకటించారు. ఆయనతోపాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పర్యవసానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం సిద్దూతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సిద్దూను తమ ఇంటికి బోజనాలకు అభ్వానించాలని ముందుగా నిర్ణయించుకున్న అమరీందర్ సింగ్.. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం సిద్దూను పిలవకుండా మిన్నకుండిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more