రాజుగారి చేపల చెరువు చిత్రం గుర్తుందా..? సరిగ్గా ఆ చిత్రం తరహాలోనే అధికారులు వ్యవహరించారు. అమ్యామాల మత్తులో అధికారులు ఎంతటి ఘనకార్యానికైనా సిద్దపడతారన్న విషయం మరోమారు రుజవైంది. తన పోలంలో బావి తొవ్విన విషయం.. అందుకు గాను ప్రభుత్వం వద్ద నుంచి తీసుకున్న రుణం గురించి కూడా ఏ మాత్రం తెలియని రైతు.. తీరా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు అందుకుని విస్తుపోయాడు. దీంతో రైతు కూడా రాజు గారి చేపల చెరువు చిత్రంలో కథనాయకుడు అనుసరించిన వ్యూహాన్నే అనుసరించి అధికారుల ఆటకట్టించాడు.
నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి తన పొలంలోని బావి అకస్మాత్తుగా అదృశ్యమైందని, వెతికి పెట్టాలని కోరుతూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని రాయ్ గభా తాలూకాలోని భెందవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని మావినహోండా గ్రామంలో జరిగిందీ ఘటన. మల్లప్ప కులగుడే అనే రైతు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి తన బావి కనిపించడం లేదంటూ ఫిర్యాదుచేశాడు. బావి కనబడకుండా పోవడం ఏంటని షాక్ తిన్న పోలీసులు ఆరా తీయగా అధికారుల అవినీతి భాగోతం డొంక కదిలింది. అసలు విషయం బయటపడింది.
అసలు విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. గ్రామంలో మలప్ప అనే పేరుకు ఈ అవినీతికి కారణమైందని తెలుస్తోంది. తమ వంశపారంపర్యంగా పలు భూములు, పంటలతో సస్యశ్యామలంగా బతికిన మల్లప్ప రామప్ప కలగుడే అనే గ్రామపెద్ద పేరున ప్రస్తుతం ఒక్క సెంటు భూమి కూడా లేదు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం డబ్బుపై మాత్రం అతని కన్నుపడింది. దానిని స్వాహా చేయడానికి గ్రామంలోని తన పేరుతో వున్న మరో రైతును ఎంచుకుని వారి పేరున బావి తొవ్వడానికి రూ.77 వేలు రుణం తీసుకున్నారు. అయితే వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు అందించారు.
నోటీసులు అందుకున్న మల్లప్ప కలగుడే షాక్ తిన్నాడు. తన పొలం గ్రామ సర్వేనెంబరు 21/1 లో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించడంపై విస్తపోయాడు. అయితే సంయమనం పాటించిన రైతు.. కూడా తాను ఎవరికీ వ్యతిరేకంగా వెళ్లినా తాను ఇరుక్కుంటానని భావించి.. తన భూమిలో తొవ్విన బావి కనిపించడం లేదని పిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక చేసేది లేక రైతు నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి తన భూమిలోని భావి అదృశ్యమైందని పోలీసులకు పిర్యాదు చేశాడు. తొలుత విస్తుపోయిన పోలీసులు అరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more