కరోనా మహహ్మారి తన రూపును మార్చుకుని మూడవదశలో దేశప్రజలపై మరింతగా విరుచుకుపడుతుందన్న అందోళనల నేపథ్యంలో దానిని నియంత్రించేందుకు జాగ్రత్త చర్యలు, సోషల్ డిస్కెన్స్, వాక్సీనేషన్ మూడు అత్యంత అవసరమని చెప్పిన ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా.. తాజాగా రెండు వాక్సీన్లు కలిపి తీసుకుంటే మరింత మెరుగైన రోగనిరోధక శక్తి సాధ్యమవుతుందని అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జీన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన రోగనిరోధక శక్తి సాధ్యమవుతుందన్నారు.
ఈ ప్రక్రియతో అధిక సంఖ్యలో యాంటీబాడీలు తయారవుతాయన్నదానిపై కొంత సమాచారం అందుబాటులో ఉందని, అయితే దీనిపై మరింత సమాచారం అవసరమని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఓ ప్రధాన టీకా, దాన్ని అనుసరిస్తూ ఓ బూస్టర్ డోసు వేసే విధానం అమల్లో ఉందని తెలిపారు. కొత్తగా ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇస్తే కాస్త అధికమోతాదులోనే దుష్పరిణామాలు కలగొచ్చన్నది ఒక వాదన అని, ఇమ్యూనిటీ రెట్టింపవుతుందని, యాంటీబాడీలు పుష్కలంగా తయారవుతాయన్నది మరొక వాదన అని గులేరియా వివరించారు.
అయితే ఈ అంశాలను నిర్ధారించేందుకు మరింత డేటా అవసరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వి, జైడస్ కాడిలా వంటి అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని, వీటిలో ఏ కాంబినేషన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నది ఇప్పుడున్న సమాచారంతో చెప్పలేమని అన్నారు. ప్రాథమికంగా కొన్ని అధ్యయనాలను చూస్తే... రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం కూడా పరిశీలించదగ్గ అంశమని సూచిస్తున్నాయని గులేరియా వెల్లడించారు.
అవసరానికి మించి ఢిల్లీ ప్రభుత్వం 4 రెట్ల ఆక్సిజన్ ను అధికంగా తీసుకుందనడం సరి కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ సబ్ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. అది కేవలం మధ్యంతర నివేదికేనని, తుది నివేదిక వచ్చే వరకు ఆగాలని సూచించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. యాక్టివ్ కేసులను తక్కువగా లెక్కించడం, ఇతర కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, బహుశా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని గులేరియా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more