మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఆనంద్ మహీంద్రా.. భారత దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తల్లో ఒకరైనప్పటికీ అందరికీ భిన్నంగా ఆయన వ్యవహరిస్తుంటారు. తన సామాజిక మాద్యామల అకౌంట్ల ద్వారా ఆయన తన సోంత బ్రాండును ప్రమోట్ చేసుకోవడం కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ముందుంటారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ పెడుతుంటారు. గా మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అయితే ఈ వీడియోపై నెట్టింట్లో ఉత్కంఠకు తెరతీసింది.
తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు 52వేల వ్యూస్ వచ్చాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. ఇదంతా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. టీ గార్టెన్ లో ఇరు వైపులా ఉన్న పొదలు చూపిస్తుండగా వీడియో మొదలైంది. అలా పచ్చని ప్రకృతిలో వెళ్తుండగా.. రోడ్ మీదే మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. అంతే వాటిని చూడగానే ఆగిపోయిన ఆ వ్యక్తి దూరం నుంచే చూస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉండిపోయాడు.
అలా కాసేపు వరకూ అంతా ప్రశాంతంగా ఉన్నా.. కొద్ది సెకన్లు గడిచాక ఒక ఎలుగుబంటి అతని వైపు పరిగెత్తుకురావడం మొదలైంది. దాంతో వీడియో పూర్తి అయింది. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు. కాగా, ఈ వీడియోను తిలకించిన నెటిజనులు మహీంద్రా గారు.. బైకర్లకు ఏమైంది..? ఎలుగుబంటి వారికేమీ హాని చేకూర్చేలేదు కదా.? అంటూ ఉత్కంఠగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇందుకు సంబంధించి ‘‘ఆ తరువాత’’ క్యాఫ్షెన్ తో మరో వీడియో కూడా పెట్టాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more