భాగ్యనగరవాసులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి సేవలకు దూరంగా వెళ్లిన ఎంఎంటీఎస్ రైళ్లు.. మరో రెండు రోజుల వ్యవధిలో ప్రపయాణికులకు సేవలు అందించేందుకు సిద్దం కానున్నాయి. దాదాపుగా 15 నెలల క్రితం ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు కూతకు రెడీ అవుతున్నా నేపథ్యంలో అత్యంత చౌక ధరలతో నగర ప్రయాణాలు చేసేందుకు నగరవాసులు కూడా సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ను ఎత్తివేయడంతో వీటిని పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు.
బస్సు, మెట్రో ప్రయాణాలతో పోల్చితే కేవలం ఐదు, పది రూపాయలతో దూర ప్రాంతాలకు నగరవాసులను చేర్చే రవాణ సాధనం ఎంఎంటీఎస్ రైలు. ఈ సాధనం అందుబాటులో లేక ఇప్పటి వరకు ప్రయాణికులు బస్సులతో పాటు ఇతర మార్గాలపై ఆధారపడ్డారు. కాగా బుధవారం నుంచి పది ఎంఎంటీఎస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అందుబాటులోకి రానున్న రైళ్లలో మూడు ఫలక్నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
47154 ఫలక్ నుమా ఉదయం 07.50 లింగంపల్లి ఉదయం 09.07
47178 లింగంపల్లి ఉదయం 09.20 ఫలక్ నుమా ఉదయం 10.42
47157 ఫలక్ నుమా ఉదయం 10.55 ఉదయం లింగంపల్లి మధ్యాహ్నం 12.20
47181 లింగంపల్లి మధ్యాహ్నం 12.40 ఫలక్ నుమా మధ్యాహ్నం 2 గంటలు
47162 ఫలక్ నుమా సాయంత్రం 4.20 లింగంపల్లి సాయంత్రం 5.45
47188 లింగంపల్లి సాయంత్రం 6.05 ఫలక్ నుమా రాత్రి 7.32
47131 లింగంపల్లి ఉదయం 08.43 హైదరాబాద్ ఉదయం 09.28
47107 హైదరాబాద్ ఉదయం 09.36 ఉదయం లింగంపల్లి ఉదయం 10.21
47141 లింగంపల్లి సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ సాయంత్రం 6.05
47119 హైదరాబాద్ సాయంత్రం 6.15 లింగంపల్లి రాత్రి 7.05
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more