Delta Plus variant of Covid-19 found in 3 states డెల్టా ప్లస్ వేరియంట్: మూడు రాష్ట్రాలకు పాకిన కొత్త రకం కరోనా

Delta plus variant of coronavirus spreading in india 3 states report cases report

Third Wave,Third Wave of corona,Third Wave of covid,Third Wave in india,india Third Wave,covid Third Wave,corona Third Wave,aiims chief,randeep gularia,delta plus variant,delta variant, Covid-19, Delta plus variant of coronavirus, Delta plus variant, Delta plus variant Maharashtra, Delta plus variant Madhya Pradesh, Delta plus variant Kerala, What is Delta plus variant, Delta plus variant in india, Coronavirus in india, coronavirus india news, coronavirus disease, Coronavirus

As India continues to fight the second wave of the coronavirus disease (Covid-19) pandemic, it is also struggling to control the increasing spread of the Delta variant,which has further mutated as Delta plus. Delta plus, also known as ‘AY.1’ variant or B.1.617.2.1, is considered to be the most dangerous variant of Covid-19.

డెల్టా ప్లస్ వేరియంట్: మూడు రాష్ట్రాలకు పాకిన కొత్త రకం కరోనా

Posted: 06/22/2021 11:26 AM IST
Delta plus variant of coronavirus spreading in india 3 states report cases report

కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా పేర్కోన్న విషయం తెలిసిందే. కాగా మూడో దశలో డెల్లా డబుల్ మ్యూటెంట్ తో కలసి దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా వస్తుందని కూడా నిపుణులు ఇప్పటికే చెప్పారు. రెండో దశలో తీవ్ర ప్రభావం చూపిన ఇండియా వేరియంట్ డెల్టా కాగా, మూడవ దశలో ప్రభావం చూపనన్న వేరియంట్ కు డెల్టా ప్లస్ అని పిలుస్తున్నారు. తొలిదశలో భయాందోళనకు గురిచేసిన మఃహమ్మారి రెండో దశలో తెలియకుండానే వచ్చేసి అనేక మందిని బలితీసుకుంది. ఇక మూడో దశ మాత్రం రాకుండానే అలజడికి గురిచేస్తోంది.

అయితే ఈ వేరియంట్ ప్రభావాన్ని అంచనా వేసేపనిలో ప్రభుత్వాలు, వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ పోకినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రకం కరోనాను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి అది ఆంధోళనకర వేరియంటేనా.? కాదా,? అన్నది వర్గీకరించనుంది. డెల్లా ప్లస్ రకం కరోనా వ్యాప్తి, తీవ్రత, వేగం విషయాల్లో ఎలావుంటుందన్న సమాచారం కోసం కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ అధికారులు వేచిచూస్తున్నారు. సమాచారం వచ్చిన తరువాత దాని గణన జరుగుతుందని తెలిపారు.

కాగా ఇప్పటికే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో విస్తరించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్రలో 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటివరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా రత్నగిరిలో 9 కేసులు బయటపడ్డాయని.. దీంతో పాటు జల్ గావ్ లో ఏడు, ముంబైలో రెండు, పాల్ఘర్, ఠానే, సిందుదుర్గ్ జి్లాల్లో ఒక్కొక్క కేసులు వెలుగుచూశాయని తెలిపింది. ఈ వేరియంట్ తో మూడో దశ ప్రారంభమైనట్లేనన్న వార్తల నేపథ్యంలో మహారాష్ట్రలో మూడో దశ ముప్పు పోంచి వుందా.? అన్న మహారాష్ట్ర అరోగ్యశాఖ పరిస్థితులను నిషితంగా గమనిస్తోంది.

ఇక మహారాష్ట్రతో పాటుగా కేరళలో మూడు కేసులు, మధ్యప్రదేశ్ లో ఒక్క కేసు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల వైద్యఅరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో 64 ఏళ్ల మహిళకు డెట్లాప్లస్ వేరియంట్ సోకినట్లుగా అమె నుంచి సేకరించిన నమూనాలు పరిక్షించగా విషయం బయటపడిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ లో అందోళనకరమైన విషయం కనుగోన్న వైద్యనిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఔషధాన్ని ఏమారుస్తుందని పరీక్షలు జరిపిన నివేదికలను రూపోందిన వారు కనుగొన్నారు. దీంతో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles