కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ వీధిలో ఒకరు దాని ప్రభావానికి గురైన ఘటనలు నమోదు చేసుకోగా. ఇక త్వరలోనే మూడో విడత కూడా భారత్ లో రానుందన్న అంచానాల నేపథ్యంలో దేశంలోని ప్రతీ గ్రామంలో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా టీకా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అరోగ్య కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్దురాలు అనారోగ్యానికి గురయ్యారు. అమె ఎంతగా చెబుతున్నా పెడచెవిన పెట్టిన ఆరోగ్య కార్యకర్తలు.. అమెకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు టీకాలను ఇచ్చారు.
అరోగ్య కార్యకర్తలు వృద్దురాలికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇవ్వడంతో అమె ఇంటికి వెళ్లి తన పిల్లలకు ఈ విషయాన్ని చెప్పింది. వారు కోపోద్రిక్తులై వచ్చి అరోగ్య కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. ఆ తరువాత విషయం వైద్యాధికారుల దృష్టికి చేరింది. ఈ క్రమంలో వృద్దురాలికి జ్వరం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన వైద్యాధికారుల బృందం అమెను తమ పర్యవేక్షణలో ఉంచేందుకు వీలుగా అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నా గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాట్నా శివారులోని పున్పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో 65 ఏళ్ల సునీలాదేవి అనే మహిళ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లారు. అక్కడ 18 ఏళ్లు పైబడిన వారికి ఓ వరుసలో, 45 ఏళ్లు పైబడిన వారికి మరో వరుసలో టీకాలు వేస్తున్నారు. మొదటి వరుసలోకి వెళ్లి కొవిషీల్డ్ టీ కా వేయించుకున్న ఆమె సిబ్బంది సూచనతో కాసేపు అక్కడే కూర్చుంది. ఐదు నిమిషాల తర్వాత మరో వరుసలోకి వెళ్లి కొవాగ్జిన్ టీకా వేయించుకున్నట్టు వైద్యాధికారి సంజయ్ కుమార్ తెలిపారు.
అయితే తాను ఐదు నిమిషాలకు ముందే టీకా తీసుకున్నానని చెబుతున్నా పెడచెవిన పెట్టిన ఆరోగ్య కార్యకర్త కారణంగానే.. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు వేశారని అమె తెలిపింది. వెంటనే ఆమెకు కొద్దిపాటి జ్వరం వచ్చిందని, దీంతో అమె ఇంటికి వెళ్లి తమ పిల్లలకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు అగ్రహోక్తులై టీకా కేంద్రానికి వచ్చి అక్కడి అరోగ్య కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని సంజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ గురించి వృద్ధురాలికి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more