హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు గజరాజు, చిరుతలు మరణం జూ అధికారులతో పాటు సందర్శకులను విషాదంలోకి నెట్టాయి. జూ పార్కులో అత్యధిక కాలం జీవించిన ఏనుగుగా రికార్డులకెక్కిన ఆడ ఏనుగు ‘గజరాణి’ మృతి చెందింది. గత ఏడాది తెలుగు చలన చిత్రసీమకు చెందిన స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ గజరాణిని దత్తత తీసుకున్నారు. దాని ఆలనాపాలనకయ్యే ఖర్చును తానే భరిస్తానని అప్పుడే జూ పార్కు అధికారులకు హామి ఇచ్చారు. అయితే ఏనుగు వైద్యానికయ్యే ఖర్చును కూడా ఆయననే భరించారు.
83 ఏళ్ల ఈ ఏనుగు వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగు నిజాం కాలం నాటిది. నగరంలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేంగిపులో కొన్నేళ్లపాటు ‘గజరాణి’ పాల్గొంది. సాధారణంగా ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లేనని, కానీ ఇది 83 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్చరణ్ దత్తత తీసుకున్నారు.
కాగా, వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు. 16 జూన్ 2000వ సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో జన్మించిన ఈ చిరుత పేరు ‘అయ్యప్ప’. చిరుత సంతతి రక్త మార్పిడిలో భాగంగా దీనిని హైదరాబాద్కు తరలించారు. చిరుతల జీవిత కాలం 15 ఏళ్లు మాత్రమేనని, అయితే జూలో వాటి సంరక్షణపై తీసుకునే శ్రద్ధ, ఆహారం కారణంగా ‘అయ్యప్ప’ మరో ఆరేళ్లు అధికంగా జీవించిందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 23 | వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు. కానీ పెళ్లికొడుకు ఆడిన ఒకే ఒక అబద్ధం ఆ వివాహాన్నే ప్రశ్నార్థకం చేసింది. పెళ్లికి రెడీ అయిన వరుడు.. సరిగ్గా పెళ్లి జరుగుతున్న క్రమంలో... Read more
May 23 | ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు.. కానీ కొన్ని సాహసాలు చేసేప్పుడు మాత్రం తప్పక అందుకు తగ్గ తర్ఫీదు అవసరం. లేకపోతే ఎంతటి ప్రమాదమో సంభవిస్తుందో చెప్పే అవకాశమే ఉండదు. అందుకనే ఏదైనా ఫీటు చేసేప్పుడు... Read more
May 23 | పిల్లలు తమ స్నేహితుల ముందు హీరోలు అనిపించుకోవాలని విలన్ పనులు చేస్తుంటారు. అయితే అలాంటి పనులు చేయడంతో తన స్నేహితుల ముందు హీరో అటుంచితే.. తన రాష్ట్రమే కాదు యావత్ దేశం ఎదుట దోషిదా... Read more
May 23 | నేటి భారతీయ సమాజం మత, కులాలపై ఆధారపడి పయనాన్ని సాగిస్తోంది. ఇవే లేకపోతే దేశం మరింత ప్రగతిపధంలోకి దూసుకెళ్లేదని మైకు పట్టుకున్న ప్రతీ నాయకుడు చెప్పే విషయమే. అయితే అది అంబేద్కర్ జయంతి రోజునో..... Read more
May 23 | ఇంధన రేట్లు అకాశాన్నంటుతున్న క్రమంలో దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ కొనసాగించాలంటూ కేంద్రం ఇంధన సంస్థలతో పాటు ఇటు ద్విచక్ర వాహనా సంస్థలను కూడా కోరింది. దీంతో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు... Read more