తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 24 గంటల వ్యవధిలో వాయుగుండం మారి.. ఇవాళ తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది పారాదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తరవాయవ్య దిశగా కదులుతోంది. ఇదే సమయంలో ఒడిశాలోని బాలసోర్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్ డిఘాకు అగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో కేంధ్రీకృతమై వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘యాస్’ ఈ నెల 26న సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, ధర్మల మధ్య తీరాన్ని తాకే అవకాశముందని ఆ తరువాత కూడా ఇది ఉత్తర, ఉత్తర, వాయువ్యాల దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం వద్ద మరోమారు తీరం దాటే అవకాశం ఉందని ఐడీఎం అధికారులు పేర్కొన్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వాయువేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు, ఇక తీరాన్ని తాకిన నేపథ్యంలో పారాదీఫ్, దర్మల మధ్య గాలులు ఏకంగా గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు తెలిపారు.
‘యాస్’ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే రేపటి నుంచి 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాస్ ధాటికి కేంద్రపాడ, జగత్ సింగ్ పూర్, బాలసోర్, భద్రక్ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చాటుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఒఢిశాలోని పూరి, కటక్, జాజ్ పూర్; యమూర్ భంజ్ లలోనూ యాస్ తన ప్రభావాన్ని చాటుతుందని, ఇక్కడ 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ లోని తీరప్రాంత జిల్లాలైన పూర్బ, పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలో, హౌరా, హూగ్లీలు మోస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. యస్ తుఫాను రేపు పెను తుపానుగా మారే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. శనివారం 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ నిన్న మరిన్ని రైళ్లను.. మొత్తంగా ఇవాళ్టికి 90 రైళ్లను రద్దు చేశామని, ఇక సాయంత్రం తుఫాను మరింత ఉదృతమైన నేపధ్యంలో మరో పది రైళ్లను కూడా రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. వీటిలో నిజాముద్దీన్, హౌరా, సంత్రగచ్చి, తిరువనంతపురం, చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, పాట్నా, పురులియా, కన్యాకుమారి, తాంబ్రం, యశ్వంత్పూర్ నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒక్కో రైలును ఒక్కో రోజు నిలిపివేస్తున్నట్టు రైల్వే తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more