పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు. ప్రధానితో కొవిడ్-19పై జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రులను కనీసం మాట్లాడేందుకూ అనుమతించడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీల్లో ముఖ్యమంత్రులను అన్నింటికీ తలలూపే తోలుబొమ్మల స్థాయికి దిగజార్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో..తనను మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని అవమానంగా భావించానని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న పది రాష్ట్రాల అధికారులు, సీఎంలతో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ప్రధాని, కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప వేరే రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు. ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధాని మోడీకి అభద్రతా భావం ఎక్కువని, అందుకే తమ మాటలను ఆయన వినట్లేదని మండిపడ్డారు. సీఎంలను మాట్లాడేందుకు అనుమతించకపోతే ఇక వారిని ఎందుకు పిలిచారని మమత ప్రశ్నించారు. సీఎంలతో ప్రధాని సమావేశం దారుణంగా విఫలమైందని ఇది సీఎంలను అవమానించేలా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రధానితో భేటీల్లో మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిరసన తెలపాలని దీదీ పిలుపు ఇచ్చారు.
సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఈ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాగైతే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మహమ్మారి బారినపడి ప్రజలు ఎందుకు మరణిస్తున్నారని దీదీ నిలదీశారు. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more