కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తున్నా.. యువత మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఇదే సమయంలో 45 ఏళ్లు పైబడిన వారిలో కరోనా మహమ్మారి అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా అధిక ప్రభావం చూపుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సీన్ కేటాయించేందుకు కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 18 ఏళ్లు పైబడినవారి కోసం కేటాయించిన టీకాలను వారికే ఇవ్వాలని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఈ నెల 1 నుంచి 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు వాక్సీన్ ఇవ్వాలని కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీంతో పాటు 18 ఏళ్లు నిండిన యువత కోసం ప్రత్యేకంగా 13 లక్షల వాక్సీన్లను కేటాయించింది. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. కాగా, అందుకు కేంద్రం నిరాకరించింది. తాము కేటాయించిన వారికే వ్యాక్సీన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పుడు కేటాయించిన వ్యాక్సిన్లు కాకుండా మరో 3.5 లక్షల వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకోసం అడ్వాన్సు కింద అవసరమైన నిధులను విడుదల చేసినట్టు చెప్పారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా చికిత్సకు అవసరమైయ్యే ఔషధాలు, ఆక్సిజన్ కోటాను పెంచాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని సింఘాల్ తెలిపారు. ఇక రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరానికి తగ్గట్టుగా రెమిడెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపులు కూడా పెంచాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారని సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత వుందని అన్నారు. మూడో వేవ్ వచ్చినా ఆక్సిజన్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రులలో ‘పీఎస్ఏ’ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని సింఘాల్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more