దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో వివిధ రకాల సైయిన్ లు భారతీయులను పట్టి పీడిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు ఏకంగా నాలుగు లక్షల మార్కును అధిగమించిన ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదును చేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తంగా కోటి 91 లక్షల మార్కు దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా కోటి 57 లక్షల మార్కుకు చేరువలో వుంది. కాగా ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 3500 మరణాలు కూడా సంభవించాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏకంగా యాభై మందికి పైగా ప్రజలు కరోనా సోకి అసువులు బాసారు.
గత ఏడాది మార్చి నుంచి దేశంలో తన ప్రభావాన్ని ఉద్దృతంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.. నవంబర్ నుంచి కాసింత తగ్గుముఖం పడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెకెండ్ వేవ్ ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఒక్కరోజులో ఏకంగా నాలుగు లక్షల సంఖ్యకు పైబడి కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులను నమోదు చేసుకున్న దేశంగా భారత్ మిగిలిపోయింది. ఈ సెంకెండ్ వేవ్ కేసులు ఉద్దృతి మరింతగా పెరగడానికి కారణం దేశంలో కరోనా స్టైయిన్ రకాలు అనేకంగా నమోదు కావడమేనని కూడా వైద్యవర్గాలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాల్లో మహరాష్ట్ర ముందంజలో వుంది. మహారాష్ట్ర నుంచి 62919 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అధ్యధిక సంఖ్యలో కర్ణాటక నుంచి కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 48,396 కేసులు నమోదు కాగా, కేరళలో 37,199 కేసులు నమోదయ్యాయి.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన గణంకాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,49,89,635 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,45,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక ఇటు తెలంగాణలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 7,754 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,62,160 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,312గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 78,888 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,507 మందికి కరోనా సోకింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more