కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనను త్వరలోనే అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ఓ వైపు వినిపిస్తుండగానే. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో 28 రోజుల అజ్ఞాతాన్ని వీడిన బాధిత యువతి అనేక నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులోని ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి పోందిన సిట్ పోలీసులు బాధితురాలని గత రెండు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే.
అయితే సెక్స్ ఫర్ జాబ్ స్కామ్ లో మంత్రి రమేశ్ జార్కిహోళితో అమె ఏకంతంగా గడిపిన సమయంలో ఆ వీడియోలను తానే స్వయంగా తీసానని బాధితురాలు సిట్ విచారణలో వెల్లడించింది. భవిష్యత్తులో ఆయన తనను వాడుకుని మోసం చేసిన క్రమంలో ఈ వీడియోలే తనకు ఆధారంగా నిలుస్తాయని తాను నమ్మి ఈ వీడీయోలను చిత్రకరించానని అమె పేర్కొంది. ఇక మంత్రి స్థానంలో వున్న వ్యక్తి మాటకే సమాజంలో విలువ అధికంగా వుంటుందని, తనకు ఉద్యోగం పెట్టించకుండా అసలు అమె ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అనే అవకాశాలు కూడా అధికంగా వున్నాయని అందుకనే కేవలం తనకు రక్షణగా, సాక్ష్యంగా, ఆధారంగా నిలుస్తాయనే ఆ వీడియోలను చిత్రీకరించినట్టు అమె తెలిపారు.
ఇక మంత్రి రమేశ్ జార్కిహోళిని ఎలా కలిసింది.. అసలు ఆయనతో ఎలా పరిచయం అయ్యింది. ఆయన సెల్ ఫోన్ ను కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఎలా సేవ్ చేసుకున్న వివరాలను కూడా బాధితురాలు సిట్ విచారణలో తెలిపారు. కొంతకాలం క్రితం తాను శాసనసభకు వెళ్లిన సమయంలో మంత్రి రమేశ్ జార్కిహోళి కలిశారని, ఆ సమయంలో ఆయన తన మొబైల్ నంబర్ ను ఇవ్వగా, దాన్ని 'మల్లేశ్వరి పీజీ' అని తన మొబైల్ లో సేవ్ చేసుకున్నానని, రాసలీలల సీడీలోని బాధిత యువతి సిట్ అధికారుల విచారణలో పేర్కొంది.
ఆమెను భారీ బందోబస్తు మధ్య బౌరిగ్ హాస్పిటల్ కు తీసుకెళ్లి, కరోనా పరీక్షలు చేయించి, నెగటివ్ వచ్చిందని తేల్చుకుని, ఆపై సిట్ ఆఫీసులో అధికారులు విచారించారు. మంత్రి తనకు సహకరించాలని కోరారని, తమ ప్రాంతంలో బలమైన నేత కావడంతోనే ఏమీ చేయలేకపోయానని వెల్లడించిన ఆమె, రెండు మూడు సార్లు తనను ఆయన శారీరకంగా వాడుకున్నారని, ఎప్పటికైనా సాక్ష్యాలుగా పనికి వస్తాయన్న కోణంలో ఆలోచించి, తానే ఈ వీడియోలను తీశానని చెప్పారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, అయితే, క్లాస్ మేట్ శ్రవణ్ అనే వ్యక్తికి, నరేశ్ అనే మరో స్నేహితుడికి ఇచ్చానని, ఇంకో కాపీని దాచుకున్నానని ఆమె పేర్కొంది.
ఇదిలావుండగా, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్ మహదేవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు తన క్లయింట్ అయిన బాధితురాలు మాజీమంత్రి రమేశ్ జార్కిహోళి ఉద్యోగం పేరుతో తనను వాడుకుని మోసం చేశారన్న కేసు నమోదైన క్రమంలో.. ఆయన సహకారంలో ఉపఎన్నికలలో విజయం సాధించాలని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేయడం హేయకరమని న్యాయవాది విమర్శించారు. కర్ణాటకలో జరగుతున్న ఉపఎన్నికలలో రమేశ్ జార్కిహోళికి పలుకుబడి వున్న ప్రాంతం కావడం.. దాంతో సీఎం యడ్యూరప్ప ఆయనను కూడా వచ్చి ఎన్నికలలో ప్రచారం చేయాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించడమే ఇందుకు కారణమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more