కరోనా వైరస్ మహమ్మారి రెండో దఫా విరుచుకుపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అందరూ మాస్కులు ధరించాలని, ప్రతీ గంటకు చేతులు కడుక్కోవాలని, బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. టీకా వేయించుకున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా రోడ్లపై బాహాటంగా సంచరిస్తున్నవారిపై జరిమానాను విధించింది.
ఇక ఈ క్రమంలో విమానాశ్రయాల్లో ఎవరైనా మాస్క్ ధరించకుండా సంచరిస్తే వారిపై కఠిన చర్యలకు పూనకునేలా అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విమానాశ్రయ అధికారులకు అదేశాలను జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ.. తాజాగా ఎయిర్ పోర్టులకు సూచనలు చేసింది. విమానాశ్రయాల్లో మాస్క్ లు లేకుండా కన్పించేవారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
దేశంలోని పలు విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనల అమలు సంతృప్తికరంగా లేదని ఇటీవల జరిపిన పరిశీలనలో తేలిన విషయం తెలిసిందే. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలని అదేశాలను డిజీసిఐ జారీ చేసింది. ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించేలా చూడాలని పేర్కోంది. ఈ అంశాలపై అన్ని విమానాశ్రయాలు మరింత నిఘా పెంచాలని కోరుతున్నామని డీజీసిఐ తమ సర్కులర్ లో పోందుపర్చింది.
నిబంధనల ఉల్లంఘించేవారిపై అవసరమైతే శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం తక్షణ జరిమానాలు విధించాలని డీజీసీఏ విమానాశ్రయ నిర్వాహకులను సూచించింది. విమానాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదేపదే హెచ్చరించినా మాస్క్ లు పెట్టుకోకపోతే విమానం నుంచి దించేయాలని ఈ నెల 13న డీజీసీఏ విమాన సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more