పశ్చిమ బెంగాల్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు దుండగులు కాల్పులకు తెగబడి ఓటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలపాలుకావడంతో వారిని హుటాహుటిన అసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పరస్పరం అరోపణలు చేసుకుంటున్నాయి.
ఓటర్లను భయందోళనకు గురిచేసేందుకు తామే ఈ కాల్పుల ఘటనకు తెగబడ్డామన్న టీఎంసీ అరోపణలను బీజేపి తీవ్రంగా ఖండిస్తోంది. టీఎంసీ నేతలు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, వారే అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత అనూప్ చక్రవర్తి ఆరోపించారు. కాగా పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి ఘటనలు ఇదివరకు ఎప్పుడూ జరగలేదని.. అలాంటిది ఈ సారి మాత్రమే జరిగాయంటే అందుకు బీజేపి కాక ఇంకెవరు కారణమని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓటర్లను భయపెట్టేందుకు బీజేపీ కార్యకర్తలే కాల్పులకు తెగబడ్డారని అరోపిస్తున్నారు.
కాగా, కోంటై నియోజకవర్గంలోని 149వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ శ్రేణులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి ఆరోపణలు చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతోన్న ఓటర్లను పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నారని చెప్పారు. దీనిపై తాము ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని, పలు విషయాలను తెలిపామని ఆయన అన్నారు. అయితే ఓటర్లు కాని వారిని కూడా ఓటర్లుగా మభ్యపెట్టి బీజేపి మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అడ్డుకుంటే బీజేపి ఓటర్లను అడ్డుకుంటున్నారని అరోపణలు చేస్తున్నారని టీఎంసీ నేతలు అరోపిస్తున్నారు.
ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 73 లక్షల మందికిపైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురూలియా, బంకురా, ఝూర్గ్రాం, తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
అసోంలోని 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 264 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరుగుతున్న 47 స్థానాలకు గాను 39 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అసోం గణ పరిషత్ 10 స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాజోత్ (గ్రాండ్ అలయెన్స్) 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఉత్సాహాన్ని చూపుతున్నారు. మధ్యాహ్నం సమయానికి బెంగాల్ లో 36శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 26.4శాతం ఓటింగ్ నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more