హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లు. ఫామ్ హౌజ్ లు, రిసార్టులు ఇలా ఎక్కడ తాము మకాం వేసి రేవ్ పార్టీలు నిర్వహించినా పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో శివారు కాకుండా నగరానికి ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో.. పల్లె వాతావరణంలో వున్న ఫామ్ హౌజ్ లు రేవ్ పార్టీలకు అడ్డగా మారుతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లోని మన్నెగూడ, చేవెళ్ల, పరిగి ప్రాంతాల్లోని పాంహౌజ్ లను వేదికగా మార్చుకున్నా.. పోలీసుల నిరంతర నిఘా.. పక్కాసమాచారంతో దాడులు నిర్వహించడంతో నిర్వాహకులతో పాటు రేవ్ పార్టీలో పాల్గోన్నవారిని కూడా అరెస్టు చేశారు.
దీంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వారాంతాలలో ఎక్కడ ఏ పార్టీ జరిగినా అక్కడ వాలిపోయి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు పోలీసులు ఆదమరిచేలా చేసి.. టెంపుల్ సిటీగా అభివృద్ది చెందుతున్న యాదాద్రి కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహించేందుకు గుట్టుగా ప్లాన్ చేస్తున్నారు. వారంతంలో పూర్తిగా మత్తులో తేలిపోతూ.. తామేం చేస్తున్నారో తమకే తెలియని విధంగా అటు మధ్యం, ఇటు మాదకద్రవ్యాలను తీసుకుంటూ.. అర్థనగ్నం నృత్యాలు.. అసాంఘిక కార్యాకలాపాలకు రేవ్ పార్టీలు అడ్డాలుగా మారి యువతను పూర్తిగా నాశనం చేసేలా తయారవుతున్నాయి.
ఈ క్రమంలో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ్పూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందులో పాల్గొన్న మొత్తం 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 ఎల్ఎన్డీ ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more