మండుటెండలు ఠారెత్తిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించి.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అకాలవర్షం కురిస్తే ఎవరైనా ఏం చేస్తారు. వర్షం నుంచి తప్పించుకునేందుకు దగ్గర్లోని ఏదైనా షెడ్డు కిందకో లేక మరేదైనా కట్టడం కిందకో పరుగులు తీస్తారు. అలాంటివేమీ కనబడకపోతే ఏ చెట్టుకిందకో పరుగులు పెడతారు. అలా అకస్మాత్తుగా కురుస్తున్న వర్షం నుంచి తప్పించుకుందామనో లేక తలదాచుకుందామనో చెట్టు కిందకు చేరిన నలుగరు వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలారు.
అసలేం జరిగింది. అప్పటివరకు చెట్టుకింద తలదాచుకుంటున్ననలుగురు వ్యక్తులు రెప్పపాటు క్షణంలో ఎందుకు కుప్పకూలారు. వారు విగతజీవుల్లో ఎందుకు పడివున్నారు. ఆ సమయంలో వారని గమనించి వైద్యచికిత్సల నిమిత్తం తరలించకుంటే పెనువిషాదం అలుముకునేంది. అకాలవర్షం కురుస్తున్నసమయంలో ఉద్యానవన సిబ్బందిగా వున్న వారిలో ఏ ఒక్కరూ ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడితే తమ పరిస్థితి ఏంటన్న అలోచనే వారికి రాలేదు. కానీ అదే జరిగింది. అకాలవర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఎక్కడో అయితే పర్వాలేదు.. కానీ వర్షానికి చెట్టుకిందన తలదాచుకుంటున్న ఈ నలుగరు అభాగ్యులు వున్న చెట్టుపైనే నేరుగా పడింది. ఇంకేముందు రెప్పపాటులో నలుగురు కుప్పకూలిపోయారు.
వీరిని గమనించిన స్థానికులు వెంటనే వారిని అసుపత్రికి తరలించగా వారిలో ఒకరు ప్రాణాలను కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇక మిగిలిన ముగ్గురు అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్యానాలోని గుర్గావ్ సెక్టార్-82లో క్రితం రోజు సాయంత్రం ఈ ఘటన సంభవించింది. ఆ చెట్టుపై పిడుగు పడిన తీరు చూస్తే నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉంటారనిపిస్తుంది. అయితే ముగ్గురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరో వ్యక్తి మాత్రం చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
Deadly Lightening in Gurgaon pic.twitter.com/nHygeNH3jX
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) March 12, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more