దేశంలోనే అత్యధిక ఫ్యాస్ట్ ట్యాగ్ లను విక్రయించిన అతిపెద్ద పేమెంట్స్ బ్యాంక్ గా అవతరించిన పేటియం సంస్థ.. తాజాగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది 2020వ సంవత్సరంలో జాతీయ రాహదారులపై ఏర్పాటు చేసిన టోట్ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది ఫ్యాస్ట్ ట్యాగ్ వినియోగదారుల నుంచి తప్పుగా వసూలు చేసిన టోల్ చార్జీ రుసుము మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పేటీయం తన వినియోగదారులకు సహయపడనుంది. దీంతో తాము ఆయా టోల్ ప్లాజాల మీదుగా వెళ్లకపోయినా తమ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ మొత్తంలోంచి తీసుకున్న మొత్తం తిరిగి వాహనదారులకు చేరనుందని పేటియం పేమెంట్స్ బ్యాంకు వాహనదారులకు శుభవార్తను చెప్పింది.
ఫాస్ట్ ట్యాగ్ వున్న వాహనాన్ని తప్పుగా గుర్తించడం లేదా టోల్ ప్లాజాల ద్వారా పొరపాటుగా రెండుసార్లు టోట్ చార్జీలను వసూళ్లు చేయడం లాంటి వాటిని గుర్తించి.. వాటిని సవరించే క్రమంలో వాహన యజమానులకు అందించడానికి జరిపే చెల్లింపులను సులభతరం చేసినట్లు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటించింది. ఇందుకుగాను పేటీఎమ్ చెల్లింపుల సంస్థ వేగవంతమైన పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇది టోల్ ప్లాజాల్లో జరిగే తప్పుడు చెల్లింపులను వెంటనే గుర్తించి పరిష్కారం చూపుతుంది.
ఫాస్టాగ్ల ద్వారా టోల్ ఛార్జీల ఆటోమేటిక్ చెల్లింపును నిర్దారించేటప్పుడు కొన్ని సార్లు టోల్ ప్లాజాల వద్ద ఉన్న సిస్టమ్స్ మరియు ప్రాసెస్లలో సమస్యలు కారణంగా అసలు ఛార్జీ కంటే ఎక్కువ వసూలుకు కారణమవుతున్నాయి. ఇటువంటి కస్టమర్ ఫిర్యాదులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి, `పీపీబీఎల్` (పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్) తన కస్టమర్ల ఫిర్యాదులు, అనుబంధ టోల్ లావాదేవీలు, టోల్ ప్లాజాల్లో జరిగే సమస్యలను పూర్తిగా ఆడిట్ చేసే ఒక ఖచ్చితమైన వివాదాలను నివారించే నిర్వహణ ప్రక్రియను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే దాదాపుగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు తమ వినియోగదారుల తరపున ఇటువంటి 82శాతం కేసులను పరిష్కరించింది. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాలలో జరిగే చెల్లింపులలో వినియోగదారులు ఎదుర్కొనే ఫిర్యాదులను సాధ్యమైనంత వేగంగా పరిష్కారించాడానికి, సరైనా టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా నిరంతరం ప్రయత్నిస్తామని.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more