తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. నడిరోడ్డుపై మిట్ట మధ్యాహ్నం జనసామర్థ్యం ఉన్న ప్రాంతంలో న్యాయవాదుల కారును అడ్డగించి కొబ్బరిబొండాలు నరికే కత్తులను చేతబూని.. న్యాయాన్ని సమాధి చేయాలన్న యోచనలో కరుడుగట్టిన నేరస్థుల ఆటవిక చర్యకు న్యాయవాది గట్టు వామన్ రావుతో పాటు ఆయన భార్య మహిళా న్యాయవాది పివి నాగమణిని బలైపోయారు. పట్టపగలు ప్రజలు చూస్తుండగా ఎలాంటి భయం లేకుండా అత్యంత పాశవికంగా న్యాయవాద దంపతులను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద ఆగంతకులు న్యాయవాద దంపతుల కారును అడ్డగించి వారిని బయటకు లాగి దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కో్హ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల కూడిన ధర్మాసనం.. న్యాయవాద దంపతుల హత్యోదంతం కేసును తాము సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. వీరి హత్య తమ దృష్టిలో వుందని పేర్కోంది. ఈ న్యాయవాద దంపతుల హత్యలపై నివేదిక తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది.
నిర్దిష్ట కాలపరిమితితో దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు అధికారులను సూచించిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి ఒకటికి వాయిదా పడింది. ఇదిలావుండగా ఈ హత్యలను నిరసిస్తూ హైకోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ రోజు అన్ని కేసుల విచారణను చేపట్టబోమని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more