ఎవరైనా ఇక తమ పని అయిపోయింది అన్నారంటే.. వారికి అతి పెద్ద ప్రమాదంలో వున్నారన్నట్లే.. ఇక చావు దాకా వెళ్లి వచ్చామనో.. లేక స్వర్గం దాక వెళ్లివచ్చామనో అంటే వారు వెంటుకవాసిలో మరణం నుంచి తప్పించుకున్నారని అర్థం. కానీ.. ఏడు గంటల పాటు చావుకు అతి చేరువుగా వుంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ మూలన కూర్చంటే.. వారి పరిస్థితి ఏమిటీ.. వారు ఏమని చెప్పాలి. అయితే చావును చంకన పెట్టుకుని ఏడు గంటలు కూర్చున్న జీవీకి మాటలు రాకపోతే ఇక దాని పరిస్థితి ఏమిటి.? భూమి మీద నూకలు వుంటే అది బతికిందని చెప్పక తప్పదు.
అభయారణ్యం సమీపంలోని జనవాసాల మధ్యకు అనుకోకుండా వచ్చిందీ ఓ చిరుతపులి. దాని కంట ఓ వీధి కుక్క పడింది. చిరత నుంచి తప్పించుకునేందుకు అది మరుగుదోడ్డిలోకి దూరింది. అంతే దాని వెంటే వచ్చిన చిరుత కూడా మరుగుదొడ్డిలోకి చేరుకుంది. అనుకోకుండా రెండు మరుగుదొడ్డిలోనే ఇరుక్కుపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమనుకుంటారు.? చిరుత చేతిలో శునకం పని అయిపోయింది అనకోకమానరు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం జరగింది. కుక్కను కనీసం ఏమీ అనకుండా చిరుత ఓ మూలన.. శునకం మరో మూలన వుండిపోయాయి. అదీనూ ఏకంగా ఏడు గంటల పాటు. ఇది నిజంగా విధి విచిత్రమే కదా.
ఇక వివరాల్లోకి వస్తే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని భిళ్ళినెల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత వారం రోజులుగా సమీపంలోని బనేర్ ఘట్టా అటవీప్రాంతం నుంచి ఓ చిరుత తమ జనవాసాల్లో తిరుగుతుందని స్థానికులు గుర్తించారు. దీంతో పోద్దెక్కే వరకు వారు భయంతో బయటకు కూడా వెళ్లడం లేదు. అయితే క్రితం రోజున ఓ మహిళ ఉదయం 7 గంటలకు తన మరుగుదోడ్డి తలుపు తీసి చూసేవరకు చిరుతపులితో పాటు శునకం అందులో వున్నాయి. దీంతో వెంటనే అమె బయట నుంచి గడియపెట్టింది. స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు చిరుత విషయమై సమాచారం అందించారు.
అయితే రంగంలోకి దిగిన అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు సుమారు ఏడు గంటల పాటు అనేక వ్యయప్రయాసలు పడ్డారు. అంతసేపు ఈ రెండు మరుగుదొడ్డిలోనే వున్నాయి తప్ప ఈ క్రమంలో చిరుత.. వీధి కుక్కపై దాడి చేయలేదు. చిరతపులి మీదకి కుక్క అరవలేదు. రెండూ అక్కడే దాక్కున్నాయి. చిరుత కోసం బోను, వలలు ఏర్పాటు చేశారు. ముందుగా కుక్కను రక్షించారు. కానీ, అప్పటికే చిరుత పారిపోయింది. ఇక దాని కోసం వేట సాగిస్తున్నారు. కర్ణాటకలోని కైకాంబ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు మిర్రర్ ట్వీట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more